Movie News

ఔను… ఆ సినిమా వల్ల ఆస్తులు పోయాయి : రకుల్ భర్త

బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు అనే పేరు కంటే.. రకుల్ ప్రీత్ భర్త అనే గుర్తింపుతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు జాకీ భగ్నానీ. బాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న ‘పూజా ఎంటర్టైన్మెంట్స్’ అధినేత వశు భగ్నానీ కొడుకే జాకీ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ కొన్నేళ్ల ముందు వరకు మంచి స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఈ మధ్య ఈ సంస్థ దారుణంగా దెబ్బ తింది. టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్‌పథ్’ 2023లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. గత ఏడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ చిత్రంలోనూ టైగర్ ఒక హీరో. మరో హీరో రోల్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ చేశాడు. ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల దెబ్బకు పూజా ఎంటర్టైన్మెంట్స్ పునాదులు కదిలిపోయాయి. 

ముఖ్యంగా ‘బడేమియా చోటేమియా’ మీద పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాకపోవడంతో పూజా ఎంటర్టైన్మెంట్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. నష్టాల భర్తీకి వశు ఫ్యామిలీ ఆస్తులు తనఖాపెట్టుకోవడం, అమ్ముకోవడం వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఆ సంస్థ ఉన్న భారీ బిల్డింగ్‌ను ఖాళీ చేశారు. అంతే కాక సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చేశారు. ఐతే ‘బడేమియా చోటేమియా’ అంత దెబ్బ కొట్టినా వశు, జాకీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఐతే ఎట్టకేలకు జాకీ ఆ సినిమా ప్రభావం గురించి మాట్లాడాడు.

‘‘ఔను. ఆ సినిమా వల్ల మా ఆస్తులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితి, బాధ ఎవరికీ రాకూడదు. జీవితంలో నాకొక గుణపాఠాన్ని నేర్పిన సినిమా అది. ఒక ప్రాజెక్టును భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించడం ముఖ్యం కాదనే విషయాన్ని మేం రిలీజ్ తర్వాతే గ్రహించాం. మా కంటెంట్‌తో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని తెలుసుకున్నాం. ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ కరెక్టే. మా కంటెంట్ ఎందుకు నచ్చలేదని మేమే పునరాలోచించుకోవాలి. అంతే తప్ప వాళ్ల నిర్ణయాన్ని తప్పుబట్టకూడదు. ఆ సినిమా పెట్టుబడిలో 50 శాతం కలెక్షన్లను కూడా తీసుకురాలేకపోయింది. మా బాధ ఎవరికీ అర్థం కాదు. దీని కోసం మేం ఆస్తులు తాకట్టు పెట్టాం. కానీ ఆ విషయాలను ఇప్పుడు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు’’ అని జాకీ అన్నాడు.

This post was last modified on May 2, 2025 12:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago