ఇటీవలే విడుదలైన సింగిల్ టీజర్ లో ప్రస్తుత ట్రెండ్ ని అనుసరిస్తూ శ్రీవిష్ణు చేసిన కొన్ని అనుకరణలు వివాదానికి దారి తీసేలా ఉండటంతో టీమ్ స్పందించింది. ముఖ్యంగా కన్నప్పలోని శివయ్యా డైలాగును వాడటం, వీడియో చివర్లో మంచు కురిసిపోయిందంటూ పలికిన పదాలు విష్ణుని హర్ట్ చేసినట్టుగా నిన్నే వార్తలు వచ్చాయి. దానికి శ్రీవిష్ణు వీడియో రూపంలో క్షమాపణ చెప్పాడు. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, కానీ కన్నప్ప టీమ్ బాధపడిందని తెలిసి మీ ముందుకు వచ్చామని, ఏవైతే ఇబ్బంది కలిగించాయో వాటిని తీసేయడమే కాక సినిమాలో కూడా ఎడిట్ చేయిస్తామని చెప్పి శుభం పలికాడు.
ఇదొక్కటే కాదు బాలయ్య, యానిమల్, చిరంజీవి, వెంకటేష్ అంటూ సింగిల్ లో చాలా రెఫరెన్సులు వాడుకున్నారు. అయితే కన్నప్పదే ఎక్కువ హైలైట్ కావడంతో విష్ణు ఇబ్బంది పడటం గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం మంచి విషయమే. మే 9 విడుదల కాబోతున్న సింగిల్ కు ట్రైలర్ వచ్చాకే బజ్ పెరిగింది. యూత్ ని ఆకట్టుకునేలా కామెడీని సెట్ చేసిన విధానం అంచనాలు రేపింది. అయితే శ్రీవిష్ణు చేసిన అనుకరణలు ఇంత దూరం వస్తాయని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. కన్నప్ప లాంటి భక్తి చిత్రాన్ని అది విడుదల కాక ముందే ఇమిటేట్ చేయడం సబబు కాదనే కామెంట్లో లాజిక్ ఉంది.
ఏదైతేనేం మొత్తానికి కాంట్రావర్సి పెద్దది కాకుండా త్వరగా ఎండ్ కార్డు పడింది. స్వాగ్ తో గత ఏడాది షాక్ తిన్న శ్రీవిష్ణు ఇప్పుడీ సింగిల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రెండీ ఎంటర్ టైనర్లకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో తనది కూడా వాటి సరసన చేరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. రాబోయే ఏడెనిమిది రోజులు ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. సమంతా నిర్మించిన శుభంతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ తో సింగిల్ కు పోటీ ఉంది. హిట్ 3 వచ్చిన వారానికే థియేటర్లకు వస్తుండటంతో బిజినెస్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. నాని వయొలెన్స్ తో మెప్పిస్తే శ్రీవిష్ణు హాస్యంతో నవ్విస్తాడేమో చూడాలి.
This post was last modified on April 30, 2025 7:13 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…