తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్యకు చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేదు. ఒకప్పుడు తెలుగులోనూ అతడికి మంచి మార్కెట్ ఉండేది. తన సినిమాలకు రూ.20 కోట్లకు మించి బిజినెస్ జరిగిన సందర్భాలున్నాయి. సూర్య సినిమా అంటే టాక్ ఎలా ఉన్నా మినిమం పది కోట్ల వసూళ్లు గ్యారెంటీ అన్నట్లుండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఇలాంటి టైంలో ‘కంగువ’తో మళ్లీ సూర్య పూర్వ వైభవం అందుకుంటాడనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రం ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు సాధించేస్తుందని నిర్మాత స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అది అతిశయోక్తిలా అనిపించినా.. తమిళంలో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని కోలీవుడ్ జనాలు నమ్మారు. కానీ చివరికి ఈ చిత్రం అతి కష్టం మీద వంద కోట్ల వసూళ్లు సాధించింది. సూర్యకు ఇది మామూలు షాక్ కాదు. ‘కంగువ’ రిలీజ్ ముంగిట సూర్య మామూలు ఉత్సాహంలో లేడు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా బాగా ప్రమోట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాను ప్రమోట్ చేసినపుడు సూర్య జోష్ మామూలుగా లేదు. కానీ సినిమా అతడి ఆశలను కూల్చేసింది. దీంతో సూర్యలో కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయిందని తన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ప్రమోషన్లలో స్పష్టంగా కనిపించింది.
అటు చెన్నైలో, ఇటు హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లలో సూర్య చాలా డల్లుగా ఉన్నాడు. అతడిలో తెలియని బాధ స్పష్టంగా కనిపించింది. ‘కంగువ’ ప్రభావం ‘రెట్రో’ బిజినెస్, ప్రి రిలీజ్ బుకింగ్స్, ఓపెనింగ్స్ మీద పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా రిలీజవుతున్నట్లే లేదు. ‘హిట్-3’ పోటీని ‘రెట్రో’ అస్సలు తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా నామమాత్రంగా రిలీజవుతోంది. బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయి. సినిమాకు చాలా మంచి టాక్ వస్తే తప్ప పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on April 30, 2025 3:45 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…