మాములుగా హీరోయిన్ మొదటి సినిమా ఫ్లాప్ అయితే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడతారు. కానీ భాగ్యశ్రీ బోర్సే కేసు వేరే. మిస్టర్ బచ్చన్ అంత పెద్ద డిజాస్టర్ అయినా తనకు మాత్రం అవకాశాలకు లోటు లేకుండా పోతోంది. విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మే 30 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటెన్స్ డ్రామా కాబట్టి భాగ్యశ్రీ పాత్ర రెగ్యులర్ తరహాలో ఉండకపోవచ్చు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా లేదా దీపావళిని టార్గెట్ చేసుకుని దాన్ని తగ్గ ప్లానింగ్ లో ఉన్నారు.
దగ్గుబాటి రానా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ‘కాంత’ చివరి స్టేజిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు. ఇవి కాకుండా భాగ్యశ్రీ బోర్సేకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ప్రభాస్ – దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కే ప్యాన్ ఇండియా మూవీలో ఈ అమ్మడినే తీసుకోవాలని చూస్తున్నారట. ఇంకా నిర్ణయం జరగలేదు కానీ ప్రాథమికంగా జరిగిన చర్చల్లో అంగీకారం వచ్చినట్టు తెలిసింది. ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తర్వాత చేయాల్సిన సినిమా కాబట్టి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. సో భాగ్యశ్రీ బోర్సేకి డేట్ల పరంగా ఇబ్బంది రాకపోవచ్చు.
చూస్తుంటే ఈ అమ్మాయి ట్రాక్ రికార్డు పూజా హెగ్డేని పోలి ఉంటోంది. తను కూడా ముకుంద ఫ్లాప్ తో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ డీజేతో పెద్ద బ్రేక్ అందుకుంది. తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇప్పుడు ఫామ్ తగ్గింది కానీ ఒక మూడేళ్లు అగ్ర స్థానాన్ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు అదే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేకు ఆఫర్లు వెల్లువెత్తడం చూస్తే పోలిక రావడం సహజం. ఇప్పుడు చేస్తున్న వాటిలో రెండు మూడు హిట్టయినా చాలు బాలీవుడ్ చూపు కూడా భాగ్యశ్రీ మీద పడుతుంది. అందం, అభినయానికి అదృష్టం తోడైతే అంతే మరి.
This post was last modified on April 30, 2025 12:41 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…