తెలుగులో అత్యంత డిమాండ్ ఉండే పండుగ సీజన్ అంటే.. సంక్రాంతే. ఆ టైంలో రిలీజయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు మామూలు రోజుల్లో కంటే చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అందుకే ఈ పండక్కి సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తుంటారు. 2026 సంక్రాంతి విషయంలోనూ చాలా ముందుగానే పోటీ మొదలైంది. సంక్రాంతి లక్ష్యంగా వివిధ చిత్ర బృందాలు అడుగులు వేశాయి.
చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ పోటీకి వచ్చే సంక్రాంతి వేదిక అవుతందనే అంచనాలు కలిగాయి. కానీ ఇప్పుడా పోటీ లేదని తేలిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్కు వాయిదా వేసేశారు. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేయబోయే సినిమానే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించిన పెద్ద సినిమా ఏదీ పండక్కి రిలీజయ్యేలా లేదు.
ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా మరే టాప్ హీరో సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు. విక్టరీ వెంకటేష్, రవితేజల కొత్త చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకోబోతున్నాయని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఆ చిత్రాలు మొదలే కాలేదు. ఇంకా నితిన్ మూవీ ‘యల్లమ్మ’, నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ లాంటి సినిమాలు కూడా రేసులోకి రావచ్చు కానీ.. చిరు-అనిల్ సినిమాకు ఉన్న హైప్ ముందు అవి చాలా చిన్నవి. కాబట్టి అనిల్ ఓ మోస్తరు సినిమా తీసినా చాలు.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ‘మెగా’ విధ్వంసం గ్యారెంటీ.
This post was last modified on April 29, 2025 6:16 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…