తెలుగులో అత్యంత డిమాండ్ ఉండే పండుగ సీజన్ అంటే.. సంక్రాంతే. ఆ టైంలో రిలీజయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు మామూలు రోజుల్లో కంటే చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అందుకే ఈ పండక్కి సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తుంటారు. 2026 సంక్రాంతి విషయంలోనూ చాలా ముందుగానే పోటీ మొదలైంది. సంక్రాంతి లక్ష్యంగా వివిధ చిత్ర బృందాలు అడుగులు వేశాయి.
చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ పోటీకి వచ్చే సంక్రాంతి వేదిక అవుతందనే అంచనాలు కలిగాయి. కానీ ఇప్పుడా పోటీ లేదని తేలిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్కు వాయిదా వేసేశారు. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేయబోయే సినిమానే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించిన పెద్ద సినిమా ఏదీ పండక్కి రిలీజయ్యేలా లేదు.
ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా మరే టాప్ హీరో సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు. విక్టరీ వెంకటేష్, రవితేజల కొత్త చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకోబోతున్నాయని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఆ చిత్రాలు మొదలే కాలేదు. ఇంకా నితిన్ మూవీ ‘యల్లమ్మ’, నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ లాంటి సినిమాలు కూడా రేసులోకి రావచ్చు కానీ.. చిరు-అనిల్ సినిమాకు ఉన్న హైప్ ముందు అవి చాలా చిన్నవి. కాబట్టి అనిల్ ఓ మోస్తరు సినిమా తీసినా చాలు.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ‘మెగా’ విధ్వంసం గ్యారెంటీ.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…