Movie News

అల్లు అరవింద్ చెప్పిన నగ్న సత్యాలు

ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఒకటే. జనాలు థియేటర్లకు ఎందుకు రావడం లేదు. రివ్యూల ప్రభావమా లేక ఎండలు, ఐపీఎల్ లాంటి ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయా అనే దాని మీద చిన్నా పెద్ద నిర్మాతలు గత కొన్ని రోజులుగా డిస్కషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. కొత్త రిలీజులకు అంతో ఇంతో పాజిటివ్ టాక్ వచ్చినా సరే కనీసం సాయంత్రం షోలకు సగం హాళ్లు నిండలేకపోవడం దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఓటిటిల గురించి కూడా ప్రస్తావన వస్తోంది. ఇవాళ జరిగిన శ్రీవిష్ణు సింగిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కొన్ని నగ్న సత్యాలు చెప్పారు.

కరోనా సమయంలో అదృష్టమో దురదృష్టమో ఓటిటి విస్తృతమయ్యిందని, దానికి అలవాటు పడిపోయామని, మార్పులో భాగంగా వచ్చిన ఇలాంటి వాటిని ఆపడం మార్చడం చేయలేమని, చాలా బాగుందని ఏదైనా సినిమా గురించి టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు కాబట్టి వాళ్ళను రప్పించేలా మంచి కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీదే ఉందని తేల్చి చెప్పారు. అంటే ఎవరి మీదో నెపం తోసేయడం కంటే పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన మాటల్లో గుర్తించవచ్చు. ఎప్పటికప్పుడు పోకడలను విశ్లేషించే అరవింద్ గారు ప్రాక్టికల్ గా మాట్లాడారు.

ఇకనైనా కంటెంట్ ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంకి వారాల తరబడి థియేటర్లు నింపిన ఆడియన్సే తర్వాత తండేల్, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లను కూడా ఆదరించారు. చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని టాక్ వచ్చినవి మొదటి రోజే ఎదురీదడం ఏప్రిల్ నెలలో ఎక్కువగా గమనించాం. సో బాగుంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఖచ్చితంగా పబ్లిక్ వస్తారనేది వాస్తవం. దాన్ని గుర్తించి స్క్రిప్ట్ స్టేజి నుంచే తప్పులను సరిచేసుకుంటూ క్వాలిటీ మీద దృష్టి పెడితే అసలే ప్రచారం చేసినా చేయకపోయినా థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతాయి. మరి ఈ మార్పు ఇకనైనా మొదలవ్వాలి.

This post was last modified on April 28, 2025 6:10 pm

Share
Show comments
Published by
Kumar
Tags: allu arvind

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

8 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago