హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో దేశమంతా తిరిగి సినిమాను ప్రమోట్ చేసుకున్న నాని ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేశాడు. ముఖ్య అతిథిగా దర్శక ధీర రాజమౌళితో పాటు హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ గెస్టులుగా రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆద్యంతం కలర్ ఫుల్ గా జరిగిన వేడుకలో ఊహించని సర్ప్రైజ్ లు ఇచ్చారు. మూవీలో అర్జున్ సర్కార్ పాత్ర వేసుకున్న వైట్ బ్లేజర్ ని జక్కన్నకు కానుకగా ఇచ్చి అక్కడికక్కడే వేయించడం ఆకట్టుకుంది. ఎస్ఎస్ఎంబి 29 మొదలయ్యాక రాజమౌళి హాజరైన బిగ్గెస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం.
ఇక యాంకర్ సుమ సరదాగా నిర్వహించిన స్టేజి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ రాబట్టింది. రాజమౌళి డ్రీం ప్రాజెక్టు అయిన మహాభారతంలో నాని ఉంటాడా లేదా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఠక్కున బదులిస్తూ నాని డెఫినిట్ గా ఉంటాడని చెప్పడం ప్రాంగణాన్ని చప్పట్లతో హోరెత్తించింది. ఇటీవలే అమీర్ ఖాన్ తాను మహాభారతం తీయబోతున్నట్టు, స్క్రిప్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇక రాజమౌళి ఈ ఆలోచనని పూర్తిగా మానుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు.
ఈ లెక్కన భవిష్యత్తులో రాజమౌళి మహాభారతం టాలీవుడ్ నుంచి రావడం ఖాయమే. ఒకవేళ ఆ ఉద్దేశం లేకపోతే ప్రకటించినప్పుడు చూద్దామనో లేదా ప్లాన్ చేసినప్పుడు చెబుతాననో అనొచ్చు. కానీ అలా కాకుండా నాని ఉంటాడని గ్యారెంటీ ఇవ్వడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఒకవేళ ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే తెలుగులో అతిరథ మహారథులందరూ ఇందులో భాగమవుతారు. రాజమౌళి హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, నితిన్, సునీల్ తో పాటు ఎవ్వరైనా సరే నో చెప్పకుండా అడిగిన పాత్ర చేసేస్తారు. ఎంత ఆలస్యమైనా సరే చరిత్రలో నిలిచిపోయే ఎపిక్ ఇవ్వాలనేది ప్రతి మూవీ లవర్ కోరిక.
This post was last modified on April 27, 2025 10:38 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…