టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వచ్చే వారం అతడి నుంచి రాబోతున్న ‘హిట్-3’ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చేస్తుండగానే.. ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసుకుని.. కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఐతే ఈసారి నాని రెండు సినిమాలను ఓకే చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి ‘ది ప్యారడైజ్’. ‘హిట్-3’ వచ్చిన కొన్ని రోజుల్లోనే దీని షూటింగ్ మొదలు కాబోతోంది. దీంతో పాటు నాని.. ‘సాహో’ దర్శకుడు సుజీత్తో ఒక సినిమాను ఓకే చేశాడు.
గత ఏడాదే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ సుజీత్ నానితో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడనే విషయంలో క్లారిటీ లేదు. అందుక్కారణం.. అతను ‘ఓజీ’లో లాక్ అయిపోయి ఉండడమే. ఒక దశలో సుజీత్తో నాని సినిమా ఉండదేమో అని అనుమానాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని నాని క్లారిటీ ఇచ్చాడు. సుజీత్తో తన సినిమా తప్పకుండా ఉంటుందని.. కానీ షూటింగ్ కొంచెం ఆలస్యంగా మొదలు కావచ్చని నాని తెలిపాడు.
ఆ సినిమాను 2027లో రిలీజ్ చేస్తామని నాని ప్రకటించడం విశేషం. ‘ఓజీ’ని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ దానయ్యనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాల్సింది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. దానయ్య ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాడు. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని చేతికి ఈ సినిమా వెళ్లినట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ‘శ్యామ్ సింగ రాయ్’తో తన బేనర్కు మంచి విజయాన్నందించిన నాని మీద వెంకట్కు చాలా అభిమానం ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘సైంధవ్’తో షాక్ తిన్న ఆయన.. మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.
This post was last modified on April 26, 2025 12:41 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…