టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వచ్చే వారం అతడి నుంచి రాబోతున్న ‘హిట్-3’ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చేస్తుండగానే.. ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసుకుని.. కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఐతే ఈసారి నాని రెండు సినిమాలను ఓకే చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి ‘ది ప్యారడైజ్’. ‘హిట్-3’ వచ్చిన కొన్ని రోజుల్లోనే దీని షూటింగ్ మొదలు కాబోతోంది. దీంతో పాటు నాని.. ‘సాహో’ దర్శకుడు సుజీత్తో ఒక సినిమాను ఓకే చేశాడు.
గత ఏడాదే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ సుజీత్ నానితో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడనే విషయంలో క్లారిటీ లేదు. అందుక్కారణం.. అతను ‘ఓజీ’లో లాక్ అయిపోయి ఉండడమే. ఒక దశలో సుజీత్తో నాని సినిమా ఉండదేమో అని అనుమానాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని నాని క్లారిటీ ఇచ్చాడు. సుజీత్తో తన సినిమా తప్పకుండా ఉంటుందని.. కానీ షూటింగ్ కొంచెం ఆలస్యంగా మొదలు కావచ్చని నాని తెలిపాడు.
ఆ సినిమాను 2027లో రిలీజ్ చేస్తామని నాని ప్రకటించడం విశేషం. ‘ఓజీ’ని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ దానయ్యనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాల్సింది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. దానయ్య ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాడు. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని చేతికి ఈ సినిమా వెళ్లినట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ‘శ్యామ్ సింగ రాయ్’తో తన బేనర్కు మంచి విజయాన్నందించిన నాని మీద వెంకట్కు చాలా అభిమానం ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘సైంధవ్’తో షాక్ తిన్న ఆయన.. మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…