నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. పర్వాలేదు నుంచి బాగానే ఉన్నాయనే టాక్స్ తెచ్చుకున్నాయి. మరీ బ్యాడ్ అనిపించుకోకపోవడం బయ్యర్లకు ఊరట కలిగించింది. బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే రెండు చిత్రాలూ గత ఇరవై నాలుగు గంటల్లో పది వేల లోపే టికెట్లు అమ్మాయి. ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇది మంచి నెంబరే అయినా హిట్ టాక్ వచ్చినవాటికి కనీసం పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో నమోదు కావాలి. ఈరోజు రేపు వీకెండ్ సెలవులను ఇవి ఎంత మేరకు వాడుకోబోతున్నాయనే దాన్ని బట్టి వీక్ డేస్ ఆక్యుపెన్సీలు ఆధారపడి ఉన్నాయి.
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు డీసెంట్ అనిపించుకునే రిపోర్ట్స్ వచ్చాయి. సారంగపాణి జాతకం మరీ హిలేరియస్ గా మ్యాడ్ రేంజ్ లో నవ్వించలేదు కానీ ఉన్నంతలో కాలక్షేపం చేయించిందనే మాట ఫ్యామిలీ ఆడియన్స్ తనవైపు తిప్పుకునే అవకాశం ఇవ్వకపోదు. కానీ నిన్న ప్రధానంగా బిసి సెంటర్స్ లో పెద్దగా జనాలు కనిపించలేదు. టాక్ వచ్చాక చూద్దాంలే అనే ధోరణితో ప్రేక్షకులు ఎదురు చూడటంతో ఎక్కువ శాతం థియేటర్లు బొటాబొటి పబ్లిక్ తోనే షోలు రన్ చేశాయి. జింఖానాకు యువత బాగానే వెళ్తున్నారు కానీ అది కూడా మేజిక్ చేసేంత స్థాయిలో అయితే కాదు.
ఒక్కటి మాత్రం నిజం. ఈ మాత్రం టాక్ తెచ్చుకోవడానికే గత రెండు మూడు వారాల సినిమాలు కిందా మీదా పడ్డాయి. ఎంత పుష్ చేసినా అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్ళలేదు. మరి సారంగపాణి జాతకం అయినా ఆ మార్కు అందుకుంటే మంచిదే. కాకపోతే ఈ రోజు నుంచి అనూహ్యమైన పికప్ రావాలి. కౌంటర్ బుకింగ్స్ పెరగాలి. అమీతుమీలాగా స్లో పాయిజన్ అవ్వాలి. డబ్బింగ్ వెర్షన్ కాబట్టి జింఖానా భారీగా ఆడకపోయినా ఓ మోస్తరుగా లాగించినా మైత్రికి సేఫ్ గేమ్ అవుతుంది. హిట్ 3 వచ్చే లోపు పెట్టుబడిని వెనక్కు తీసుకోవచ్చు. వసూళ్ల పర్వం ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజులు గమనించాలి.
This post was last modified on April 26, 2025 10:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…