నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. పర్వాలేదు నుంచి బాగానే ఉన్నాయనే టాక్స్ తెచ్చుకున్నాయి. మరీ బ్యాడ్ అనిపించుకోకపోవడం బయ్యర్లకు ఊరట కలిగించింది. బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే రెండు చిత్రాలూ గత ఇరవై నాలుగు గంటల్లో పది వేల లోపే టికెట్లు అమ్మాయి. ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇది మంచి నెంబరే అయినా హిట్ టాక్ వచ్చినవాటికి కనీసం పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో నమోదు కావాలి. ఈరోజు రేపు వీకెండ్ సెలవులను ఇవి ఎంత మేరకు వాడుకోబోతున్నాయనే దాన్ని బట్టి వీక్ డేస్ ఆక్యుపెన్సీలు ఆధారపడి ఉన్నాయి.
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు డీసెంట్ అనిపించుకునే రిపోర్ట్స్ వచ్చాయి. సారంగపాణి జాతకం మరీ హిలేరియస్ గా మ్యాడ్ రేంజ్ లో నవ్వించలేదు కానీ ఉన్నంతలో కాలక్షేపం చేయించిందనే మాట ఫ్యామిలీ ఆడియన్స్ తనవైపు తిప్పుకునే అవకాశం ఇవ్వకపోదు. కానీ నిన్న ప్రధానంగా బిసి సెంటర్స్ లో పెద్దగా జనాలు కనిపించలేదు. టాక్ వచ్చాక చూద్దాంలే అనే ధోరణితో ప్రేక్షకులు ఎదురు చూడటంతో ఎక్కువ శాతం థియేటర్లు బొటాబొటి పబ్లిక్ తోనే షోలు రన్ చేశాయి. జింఖానాకు యువత బాగానే వెళ్తున్నారు కానీ అది కూడా మేజిక్ చేసేంత స్థాయిలో అయితే కాదు.
ఒక్కటి మాత్రం నిజం. ఈ మాత్రం టాక్ తెచ్చుకోవడానికే గత రెండు మూడు వారాల సినిమాలు కిందా మీదా పడ్డాయి. ఎంత పుష్ చేసినా అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్ళలేదు. మరి సారంగపాణి జాతకం అయినా ఆ మార్కు అందుకుంటే మంచిదే. కాకపోతే ఈ రోజు నుంచి అనూహ్యమైన పికప్ రావాలి. కౌంటర్ బుకింగ్స్ పెరగాలి. అమీతుమీలాగా స్లో పాయిజన్ అవ్వాలి. డబ్బింగ్ వెర్షన్ కాబట్టి జింఖానా భారీగా ఆడకపోయినా ఓ మోస్తరుగా లాగించినా మైత్రికి సేఫ్ గేమ్ అవుతుంది. హిట్ 3 వచ్చే లోపు పెట్టుబడిని వెనక్కు తీసుకోవచ్చు. వసూళ్ల పర్వం ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజులు గమనించాలి.
This post was last modified on April 26, 2025 10:42 am
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…