2021 సంక్రాంతికి భారీ చిత్రాలేమీ ఉండవని ఇప్పటికే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ పండుగ సీజన్కు అటు ఇటుగా ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చాలా వరకు తెరుచుకోలేదు. ఏ పెద్ద సినిమా కూడా విడుదల దిశగా అడుగులేస్తున్నట్లు సంకేతాలే కూడా లేవు. చిరంజీవి సినిమా ఆచార్య రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ వేసవి రేసులోకి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ గురించి కూడా చప్పుడు లేకపోవడంతో పెద్ద సినిమాల కళ లేనట్లే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వకీల్ సాబ్ సంక్రాంతి రేసులోకి వస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏడు నెలలకు పైగా విరామం తర్వాత నవంబరు 1నే పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. అది వకీల్ సాబ్ కోసమే. అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది. కోర్టు నేపథ్యంలో సినిమాలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. పవన్ రెండు వారాల పాటు నిర్విరామంగా షూటింగ్కు హాజరవుతాడట. అంతటితో ఆయన పాత్ర తాలూకు సన్నివేశాలన్నీ దాదాపు పూర్తి కావస్తాయని సమాచారం.
పవన్ రావడానికి నెల ముందే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. వేరే నటీనటులతో సన్నివేశాల చిత్రీకరణ సాగించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇప్పుడు పవన్తో ముడిపడ్డ సన్నివేశాలన్నీ పూర్తి చేయబోతున్నారు. నవంబరు నెలాఖరుకు టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావస్తుందని.. సంక్రాంతికి ఒకప్పట్లా సినిమాలు నడిచే పరిస్థితి ఉంటే ‘వకీల్ సాబ్’ను రేసులో నిలపాలని చూస్తున్నారని తాజా సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మీడియం రేంజ్ నాలుగు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ రేసులో ఉంటే వాటి నిర్మాతల ప్రణాళికలు మార్చుకుంటారు.
This post was last modified on November 3, 2020 11:20 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…