మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మెగా 157 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కు సంబంధించిన పనుల్లో అనిల్ బిజీగా ఉన్నాడు. విలన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఆరెక్స్ 100 హీరో కార్తికేయని మంచి ఆప్షన్ గా భావిస్తున్నట్టు లేటెస్ట్ లీక్. గతంలో తను అజిత్ వలిమై, నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. కాకపోతే ఆ రెండూ పెద్ద స్థాయిలో బ్లాక్ బస్టర్లు కాలేదు కానీ కంటెంట్ పరంగా పేరు తీసుకొచ్చాయి.
హీరోగా బాగా స్ట్రగుల్ అవుతున్న కార్తికేయకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఇన్నేళ్ల కెరీర్ లో పట్టుమని అయిదు హిట్లు లేకపోవడం కెరీర్ మీద ప్రభావం చూపిస్తోంది. బెదురులంక 2012 ఓ మోస్తరుగా బాగానే ఆడినప్పటికీ పెద్ద బ్రేక్ అయితే దక్కలేదు. ఈ నేపథ్యంలో తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి సినిమాలో భాగం అంటే క్షణమైనా ఆలోచించకపోవచ్చు. పైగా అనిల్ రావిపూడి విలన్లు భీకరంగా ఉండరు. కాస్త ఫన్ టచ్ కూడా ఉంటుంది. అజిత్ తో నటించడం ద్వారా ఒక కలను నెరవేర్చుకున్న కార్తికేయ ఇప్పుడు జీవిత లక్ష్యమైన మెగా మూవీలో చిరు పక్కన కనిపించడం నెరవేరితే అంతకన్నా ఏం కావాలి.
ప్రస్తుతానికి ఇది లీక్ కాబట్టి అధికారిక ముద్ర వచ్చే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. విశ్వంభర ప్రమోషన్లు త్వరలోనే మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో చిరంజీవి వాటికి అవసరమైన డేట్లు మినహాయించి అనిల్ రావిపూడికి నాన్ స్టాప్ గా రెండు నెలలు కాల్ షీట్స్ ఇస్తారని సమాచారం. హీరోయిన్ తదితర వివరాలకు సంబందించిన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2026 సంక్రాంతి విడుదలని లాక్ చేసుకోవడంతో దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. చిరంజీవి రా ఆఫీసర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది కానీ అది ఉత్తిదేనని యూనిట్ మాట. చూడాలి మరి కార్తికేయ న్యూస్ నిజమవుతుందో లేదో.
This post was last modified on April 24, 2025 1:03 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…