టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జాగర్లమూడి క్రిష్. తన తొలి చిత్రం గమ్యం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి మంచి సినిమాలు తీశాడాయన. కాకపోతే ఆయన కెరీర్లో కమర్షియల్ సక్సెస్లు తక్కువ. అయినా సరే ఎప్పటికప్పుడు ఆసక్తికర ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ బిజీగానే కనిపించేవాడు. కానీ యన్.టి.ఆర్ సినిమాతో ఆయన కెరీర్ తిరగబడింది. ఆ సినిమా క్రిష్ పేరును దెబ్బ తీసింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. ఐతే ఆ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు చిత్రాన్నిప్రకటించడంతో క్రిష్ పేరు మళ్లీ మార్మోగింది.
ఐతే క్రిష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా కాస్తా.. చివరికి ఆయన చేజారింది. విపరీతంగా ఆలస్యం అవుతుండడంతో క్రిష్ ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ దర్శకుడి పాత్రలోకి మారాడు. కానీ అతనొచ్చాక కూడా సినిమా ముందుకు కదలట్లేదు. వీరమల్లు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
కట్ చేస్తే క్రిష్ హరిహర వీరమల్లును వదిలేశాక అనుష్కతో ఘాటి అనే ఇంట్రెస్టింగ్ మూవీని మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రోమోలు భలేగా అనిపించాయి.
ఒకప్పటి సినిమాల తరహాలోనే చకచకా షూట్ చేస్తూ రిలీజ్కు రెడీ చేయాలని చూశాడు క్రిష్. హరిహర వీరమల్లు కంటే ముందు ఇదే రిలీజయ్యేలా కనిపించింది. ఏప్రిల్ 18కి డేట్ ఇచ్చారు. కానీ తీరా ఆ డేట్ దగ్గరపడేసరికి ఆ చిత్రం అతీగతీ లేకుండా పోయింది. కొన్ని నెలలుగా ఘాటి గురించి చర్చే లేదు. షూటింగ్ ఏమైందో, రిలీజ్ ఎప్పుడో ఏ సమాచారం లేదు. తెరపై క్రిష్ వర్క్ చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లకు నిరాశ తప్పట్లేదు. అటు వీరమల్లు రిలీజ్ కాకుండా ఆగిపోయి.. ఇటు ఘాటి సంగతి కూడా అయోమయంగా తయారై క్రిష్ పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది. ఎంతో విషయం ఉన్న దర్శకుడు కెరీర్ను ఇలా దెబ్బ తీసుకుంటున్నాడేంటి అని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఘాటి గురించి వీలైనంత త్వరగా అప్డేట్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
This post was last modified on April 21, 2025 7:08 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…