ఒక హీరో.. ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు చిత్రాల్లో నటిస్తే వారి బంధం గురించి రూమర్స్ రావడం మామూలే. ఐతే ఒక్క సినిమాకే ఇలా వార్తల్లో నిలిచిన వాళ్లూ ఉన్నారు. ఐతే ఇప్పుడో జంట తొలిసారి కలిసి నటించిన సినిమా.. ఇంకా పూర్తి కాముందే సోషల్ మీడియా దృష్టిలో పడిపోయారు. వాళ్లే.. రామ్, భాగ్యశ్రీ బోర్సే. గత ఏడాది తెలుగులో నటించిన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో భాగ్యశ్రీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రిలీజ్కు ముందే భాగ్యశ్రీ అందచందాలు కుర్రకారుకు కిక్కెక్కించాయి.
ఆ సినిమా ప్రోమోలు వైరల్ కావడంలో భాగ్యశ్రీ పాత్ర కీలకం. తొలి చిత్రం నిరాశపరిచినప్పటికీ భాగ్యశ్రీకి అవకాశాలు వరుస కట్టాయి. అందులో ఆమె మొదట టేకప్ చేసిన సినిమా.. రామ్ హీరోగా నటిస్తున్నదే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లాస్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా వరుసగా మాస్ మసాలా సినిమాలే చేస్తున్న రామ్.. ఈ చిత్రంతో వైవిధ్యం చూపించబోతున్నాడు. ఇందుకోసం లుక్ కూడా మార్చేశాడు. అతడి పక్కన భాగ్యశ్రీ భలేగా ఉంటుందనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.
ఐతే షూట్ సందర్భంగా రామ్, భాగ్యశ్రీ బాగా దగ్గరైపోయారనే రూమర్లు ఇటీవల గట్టిగా వినిపిస్తున్నాయి. అందులోనూ తాజాగా హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలు షేర్ చేయగా.. అవి ఒకే గది నుంచి తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇలాగే అభిమానులను టీజ్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. రామ్, భాగ్యశ్రీ జంటను కూడా అదే గాటన కట్టి ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ప్రచారం రామ్, భాగ్యశ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on April 20, 2025 6:09 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…