దశాబ్దంన్నరకు పైగా కథానాయికగా కొనసాగుతున్న ఇటు తెలుగులో, అటు తమిళంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన కాజల్ అగర్వాల్.. ఉన్నట్లుండి పెళ్లి చేసేసుకుంది. తన పెళ్లి గురించి ఆమె గత నెలలోనే ప్రకటించింది. ఆ నెలలోనే పెళ్లి కూడా చేసేసుకుంది. కరోనా టైం కావడంతో సాధ్యమైంత తక్కువ మంది అతిథుల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఐతే వధూవరులను ముస్తాబు చేసే విషయంలో మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేకపోయింది. ఇద్దరి స్థాయికి తగ్గట్లే భారీగా ఖర్చు పెట్టి స్పెషల్గా డిజైన్ చేసిన దుస్తులు ధరించారు కాజల్, గౌతమ్.
కాజల్ ధరించిన లెహంగా వెనుక చాలా కథే ఉందట. దీని గురించి సోషల్ మీడియాలో ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా పోస్ట్ చేసింది. ఎంతో ప్రేమతో ఈ లెహంగాను తయారు చేశామని.. ఫ్లోరల్ డిజైన్లో ఈ లెభంగాను ఎంబ్రాయిడరీ వర్క్ చేయించడానికి 20 మంది దాదాపు నెల రోజుల పాటు కష్టపడ్డారని ఆమె వెల్లడించింది. అంటే కాజల్ తన పెళ్లి గురించి ప్రకటన చేయడానికి ముందే ఈ లెహంగా తయారీ పని మొదలైందన్నమాట. ఈ లెహంగా ఖరీదు లక్షల్లోనే ఉంటుందని అర్థమవుతోంది.
మరోవైపు తాళి కట్టించుకునే సమయంలో కాజల్ ధరించిన ఆభరణాలు కూడా బాగా ఖరీదైనవే. వాటిని సునీతా షెకావత్ అనే డిజైనర్ స్వయంగా చేతితో తయారు చేసింది. ముంబయిలోని తాజ్ హోటల్లో పరిమితమైన అతిథుల మధ్యే పెళ్లి ఘనంగా చేసుకుంది కాజల్, గౌతమ్ జంట. ఇక పెళ్లి తర్వాతి రోజు ఉదయం గౌతమ్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. నిద్ర లేచి లేజీగా కనిపిస్తున్న కాజల్ ఫొటో పెట్టి.. మిసెస్ కిచ్లుగా నిద్ర లేచిన కాజల్ అంటూ వ్యాఖ్య జోడించాడు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…