మెగాస్టార్ చిరంజీవిలోని బహుముఖ ప్రజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల సంగతలా వదిలేస్తే ఆయన వంట పని, ఇంటి పని బాగా చేస్తారు. ముఖ్యంగా చిరు వంట ప్రావీణ్యం గురించి చెప్పడానికి చాలానే ఉంది. కర్ణాటకలో ఎప్పుడో షూటింగ్ సందర్భంగా చూసిన ఒక దోసె నచ్చి దానికి తన నైపుణ్యం కూడా జోడించి సరికొత్త దోసె తయారు చేస్తే ఒక ప్రఖ్యాత హోటల్లో అది ఒక స్పెషల్ వంటకంగా మారడం విశేషం.
ఇక కరోనా-లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న సమయంలో చిరు ఒకసారి తన స్పెషల్ దోసె, మరోసారి చేపల ఫ్రై చేసి అందరినీ అలరించాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత చిరు మరోసారి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈసారి చిరు మోడర్న్ చెఫ్ అవతారం ఎత్తారు. ఈ తరం పిల్లలకు బాగా నచ్చే కేఎఫ్సీ టైప్ ఫ్రైడ్ చికెన్ ట్రై చేశారు. తన ఇద్దరు మనవరాళ్లు సంహిత, నివృతిల కోసం ఆయనీ వంటకం చేశారు. వాళ్లిద్దరూ కేఎఫ్సీ చికెన్ తినాలని ఆశపడితే.. బయట తిండి ఈ టైంలో అంత మంచిది కాదంటూ చిరు తనే ఆ తరహా ఫ్రైడ్ చికెన్ చేయడానికి నడుం బిగించారు.
ఐతే అన్నీ తనే చేయకుండా ఆ పిల్లలిద్దరితోనే ఇందుకు అవసరమైన పదార్థాలన్నీ రెడీ చేయించి.. కాంబినేషన్లు చెప్పి.. చివరగా ఆయిల్లోకి చికెన్ వేసి ఫ్రై చేసి బయటికి తీసి పిల్లలకు వడ్డించారు. దీనికి చిరు కామెంట్రీ బాగా ఆకట్టుకుంది. ఆయన చేయించిన చికెన్ తిన్న మనవరాళ్లు కేఎఫ్సీలో కంటే ఇది ఇంకా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం.
This post was last modified on November 2, 2020 10:28 am
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…