దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శకుల్లో శంకర్ ఒకడు. ‘జెంటిల్మేన్’తో మొదలుపెట్టి ‘2.0’ వరకు శంకర్ తీసినవన్నీ ప్రపంచ స్థాయి సినిమాలే. ఐతే గత కొన్నేళ్లలో ఆయన్నుంచి అభిమానులు ఆశించే స్థాయి సినిమా రాలేదు. ‘రోబో’ తర్వాత శంకర్ చేసిన సినిమాలేవీ అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన రెండు దశాబ్దాల కిందటి తన బ్లాక్బస్టర్ మూవీ ‘ఇండియన్’కు సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఆ సినిమా ముందుకు కదలకపోవడానికి కరోనా కూడా ఒక కారణమే. వేరే కారణాలు కూడా తోడై దాదాపు ఏడాదిగా శంకర్ ఖాళీగా ఉన్నాడు. ఐతే ముందు వేరే ఆలోచనలేమీ లేవు కానీ.. కరోనా వల్ల వచ్చిన విరామంలో మాత్రం శంకర్ తన తర్వాతి సినిమా మీద దృష్టిసారించాడట. ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తీయడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ మంచి పేరున్న శంకర్.. ఈ నాలుగు భాషల నుంచి ఒక్కో స్టార్ హీరోను ఎంచుకుని మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్.. తమిళంలో నుంచి విజయ్ సేతుపతి ఈ సినిమాకు ఖరారైనట్లు చెబుతున్నారు. రజనీకాంత్తో ‘లింగ’.. తెలుగులో రవితేజతో ‘పవర్’ లాంటి సినిమాలు నిర్మించిన కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాడట.
‘ఇండియన్-2’ పున:ప్రారంభంపై క్లారిటీ రాకపోవడంతో శంకర్ ఈ సినిమానే ముందు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీరుతో విసిగిపోయిన శంకర్.. వెంటనే సినిమాను పున:ప్రారంభించేది లేనిది చెప్పకపోతే తాను వేరే సినిమాను మొదలుపెడతానని హెచ్చరిస్తూ ఇటీవల లేఖ కూడా రాసినట్లు తమిళ మీడియా వెల్లడించింది. ఐతే ముందో, వెనుకో ఈ మల్టీస్టారర్ మూవీని శంకర్ చేయడమైతే గ్యారెంటీనే అంటున్నారు.
This post was last modified on November 1, 2020 6:33 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…