టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. టాలీవుడ్లో పెద్ద హీరోలందరూ ఇంట్రెస్టింగ్ లైనప్స్తోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓవైపు బాలీవుడ్ మూవీ ‘వార్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్న తారక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత తారక్ నటించే సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అతను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ప్రస్తుతం ‘జైలర్-2’ చేస్తున్న నెల్సన్.. అది పూర్తవగానే తారక్ సినిమాను మొదలుపెడతాడని భావిస్తున్నారంతా. ఐతే నెల్సన్ మూవీ కొంచెం ఆలస్యం కాబోతోందని అర్థమవుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఎన్టీఆర్ ‘దేవర-2’ అటకెక్కినట్లే అనుకున్నారంతా. ‘దేవర’ నెగెటివిటీని తట్టుకుని ఎలాగోలా సక్సెస్ అనిపించుకుంది కానీ.. ‘దేవర-2’ విషయంలో అభిమానుల్లోనే అంతగా ఆసక్తి లేని నేపథ్యంలో ఆ సినిమా ఉండదనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తారక్ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.
తాజాగా తారక్ అన్నయ్య కూడా ‘దేవర-2’ గురించి అప్డేట్ ఇచ్చాడు. తారక్ ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయగానే ‘దేవర-2’ సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. అది పూర్తి చేశాక నెల్సన్ సినిమాను మొదలుపెడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘దేవర’ నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ ఒకడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కన్ఫమ్ చేశాడంటే ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా ‘దేవర-2’ మీదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-నెల్సన్ మూవీ 2027లో కానీ పట్టాలెక్కదన్నమాట.
This post was last modified on April 14, 2025 1:08 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…