టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. టాలీవుడ్లో పెద్ద హీరోలందరూ ఇంట్రెస్టింగ్ లైనప్స్తోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓవైపు బాలీవుడ్ మూవీ ‘వార్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్న తారక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత తారక్ నటించే సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అతను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ప్రస్తుతం ‘జైలర్-2’ చేస్తున్న నెల్సన్.. అది పూర్తవగానే తారక్ సినిమాను మొదలుపెడతాడని భావిస్తున్నారంతా. ఐతే నెల్సన్ మూవీ కొంచెం ఆలస్యం కాబోతోందని అర్థమవుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఎన్టీఆర్ ‘దేవర-2’ అటకెక్కినట్లే అనుకున్నారంతా. ‘దేవర’ నెగెటివిటీని తట్టుకుని ఎలాగోలా సక్సెస్ అనిపించుకుంది కానీ.. ‘దేవర-2’ విషయంలో అభిమానుల్లోనే అంతగా ఆసక్తి లేని నేపథ్యంలో ఆ సినిమా ఉండదనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తారక్ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.
తాజాగా తారక్ అన్నయ్య కూడా ‘దేవర-2’ గురించి అప్డేట్ ఇచ్చాడు. తారక్ ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయగానే ‘దేవర-2’ సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. అది పూర్తి చేశాక నెల్సన్ సినిమాను మొదలుపెడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘దేవర’ నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ ఒకడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కన్ఫమ్ చేశాడంటే ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా ‘దేవర-2’ మీదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-నెల్సన్ మూవీ 2027లో కానీ పట్టాలెక్కదన్నమాట.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…