టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. టాలీవుడ్లో పెద్ద హీరోలందరూ ఇంట్రెస్టింగ్ లైనప్స్తోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓవైపు బాలీవుడ్ మూవీ ‘వార్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్న తారక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత తారక్ నటించే సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అతను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ప్రస్తుతం ‘జైలర్-2’ చేస్తున్న నెల్సన్.. అది పూర్తవగానే తారక్ సినిమాను మొదలుపెడతాడని భావిస్తున్నారంతా. ఐతే నెల్సన్ మూవీ కొంచెం ఆలస్యం కాబోతోందని అర్థమవుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఎన్టీఆర్ ‘దేవర-2’ అటకెక్కినట్లే అనుకున్నారంతా. ‘దేవర’ నెగెటివిటీని తట్టుకుని ఎలాగోలా సక్సెస్ అనిపించుకుంది కానీ.. ‘దేవర-2’ విషయంలో అభిమానుల్లోనే అంతగా ఆసక్తి లేని నేపథ్యంలో ఆ సినిమా ఉండదనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తారక్ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.
తాజాగా తారక్ అన్నయ్య కూడా ‘దేవర-2’ గురించి అప్డేట్ ఇచ్చాడు. తారక్ ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయగానే ‘దేవర-2’ సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. అది పూర్తి చేశాక నెల్సన్ సినిమాను మొదలుపెడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘దేవర’ నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ ఒకడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కన్ఫమ్ చేశాడంటే ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా ‘దేవర-2’ మీదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-నెల్సన్ మూవీ 2027లో కానీ పట్టాలెక్కదన్నమాట.
This post was last modified on April 14, 2025 1:08 pm
ఆమిర్ ఖాన్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఆయన సినిమాల్లో ‘తారే జమీన్ పర్’ చాలా స్పెషల్.…
కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…
పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…
ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం…
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…