టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. టాలీవుడ్లో పెద్ద హీరోలందరూ ఇంట్రెస్టింగ్ లైనప్స్తోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓవైపు బాలీవుడ్ మూవీ ‘వార్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్న తారక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత తారక్ నటించే సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అతను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ప్రస్తుతం ‘జైలర్-2’ చేస్తున్న నెల్సన్.. అది పూర్తవగానే తారక్ సినిమాను మొదలుపెడతాడని భావిస్తున్నారంతా. ఐతే నెల్సన్ మూవీ కొంచెం ఆలస్యం కాబోతోందని అర్థమవుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఎన్టీఆర్ ‘దేవర-2’ అటకెక్కినట్లే అనుకున్నారంతా. ‘దేవర’ నెగెటివిటీని తట్టుకుని ఎలాగోలా సక్సెస్ అనిపించుకుంది కానీ.. ‘దేవర-2’ విషయంలో అభిమానుల్లోనే అంతగా ఆసక్తి లేని నేపథ్యంలో ఆ సినిమా ఉండదనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తారక్ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.
తాజాగా తారక్ అన్నయ్య కూడా ‘దేవర-2’ గురించి అప్డేట్ ఇచ్చాడు. తారక్ ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయగానే ‘దేవర-2’ సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. అది పూర్తి చేశాక నెల్సన్ సినిమాను మొదలుపెడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘దేవర’ నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ ఒకడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కన్ఫమ్ చేశాడంటే ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా ‘దేవర-2’ మీదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-నెల్సన్ మూవీ 2027లో కానీ పట్టాలెక్కదన్నమాట.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…