మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్ అయింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అంటే.. మాస్ పాటలు, అందులో అదిరిపోయే శ్రీలీల స్టెప్పులే. రవితేజ పక్కన శ్రీలీల ఏంటి అని రిలీజ్కు ముందు చాలామంది కామెంట్లు చేశారు కానీ.. ఆ జోడీ మాస్ పాటలతో స్క్రీన్లను తగలెట్టేసింది. ఇప్పుడు ఈ జోడీని మళ్లీ తెరపై చూడబోతున్నాం. రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’లోనూ శ్రీలీలే హీరోయిన్. ‘ధమాకా’కు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ చిత్రానికీ మ్యూజిక్ చేశాడు. అసలే రవితేజ సినిమా.
పైగా ‘మాస్ జాతర’ అనే టైటిల్ పెట్టారు. పైగా రవితేజకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్ర చేస్తున్నాడిందులో. దీంతో మాస్ రాజా మాస్ ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం నుంచి తొలి పాట గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ పాట ప్రోమో రవితేజ అభిమానుల్లో మాంచి హుషారు పుట్టించింది. ఇందులో రవితేజ తన ఫేమస్ ‘ఇడియట్’ స్టెప్ వేయడం విశేషం. ఆ చిత్రంలో చూపుల్తో గుచ్చి గుచ్చి పాటకు రవితేజ వేసిన స్టెప్ ఐకానిక్గా నిలిచిపోయింది.
ఈ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు మళ్లీ ఆ స్టెప్ను రీక్రియేట్ చేయించారు రవితేజతో. ఈ స్టెప్ నోస్టాల్జిగ్గా అనిపించగా.. పక్కనే శ్రీ లీల కూడా ఉండడంతో ఈ పాట మీద అంచనాలు పెరిగిపోయాయి. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజ-శ్రీలీల జోడీ స్క్రీన్ మీద మాంచి ఫైర్ చూపించబోతోందని అర్థమవుతోంది. మంచి ఫాంలో ఉన్న భీమ్స్ నుంచి ఊపున్న మాస్ పాటను ఆశిస్తున్నారు అభిమానులు. ‘సామజవరగమన’ రైటర్ భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 12, 2025 5:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…