ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ప్రాజెక్టు ఓకే అయిపోయింది. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయితే జాట్ చూశాక వాళ్లలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. తనకు పట్టున్న మాస్ ఎలిమెంట్స్ మీద కాకుండా ఈసారి మలిలేని ఎక్కువగా విలనిజం, వయొలెన్స్ మీద దృష్టి పెట్టాడు. అసలు రణదీప్ హుడా పోషించిన పాత్రకు అవసరానికి మించిన నిడివి డిజైన్ చేసుకోవడం దగ్గరే పొరపాటు మొదలయ్యింది.
దీనికి తోడు హింస మోతాదు బాగా ఎక్కువయ్యింది. ఊళ్ళో యువకులు వేళ్ళు కోసుకుని ప్రెసిడెంట్ కు పంపడం, ఇంటికొచ్చిన లేడీ పోలీసులతో రెజీనా క్యారెక్టర్ ప్రవర్తించే తీరు, పదే పదే తలలు నరికే విజువల్స్ ఇవన్నీ మాస్ కేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ జడుసుకునేలా ఉన్నాయి. ప్రతిదానికి మాస్ ముద్ర వేయలేం. సమరసింహారెడ్డి, ఇంద్ర, అతనొక్కడే లాంటి సినిమాల్లో కూడా తలలు నరికే సీన్లుంటాయి. కానీ వాటి డైరెక్టర్లు ఒకటి రెండు షాట్లకు పరిమితం చేశారు. కానీ జాట్ లో రిపీట్ గా చూపించడం వల్ల ఒక వర్గం క్లాస్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
తమ హీరోతో చేయబోయే సినిమాలో జాట్ లా కాకుండా బాలయ్య మార్కు ఫార్ములా వాడాలని కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డిలోనూ సెకండాఫ్ పరంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వాల్తేరు వీరయ్య తర్వాత నిలవాల్సి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే జాట్ తరహా ట్రీట్ మెంట్ కన్నా రవితేజ క్రాక్ టైపు స్క్రీన్ ప్లేని రాసుకుంటే ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణకు ఇవ్వొచ్చు. సల్మాన్ ఖాన్ సికందర్ కంటే మేలే అనిపించుకున్నప్పటికీ జవాన్, గదర్ 2 స్థాయిలో జాట్ బ్లాక్ బస్టరయ్యే సూచనలు లేనట్టే. కాకపోతే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on April 12, 2025 1:12 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…