ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ప్రాజెక్టు ఓకే అయిపోయింది. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయితే జాట్ చూశాక వాళ్లలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. తనకు పట్టున్న మాస్ ఎలిమెంట్స్ మీద కాకుండా ఈసారి మలిలేని ఎక్కువగా విలనిజం, వయొలెన్స్ మీద దృష్టి పెట్టాడు. అసలు రణదీప్ హుడా పోషించిన పాత్రకు అవసరానికి మించిన నిడివి డిజైన్ చేసుకోవడం దగ్గరే పొరపాటు మొదలయ్యింది.
దీనికి తోడు హింస మోతాదు బాగా ఎక్కువయ్యింది. ఊళ్ళో యువకులు వేళ్ళు కోసుకుని ప్రెసిడెంట్ కు పంపడం, ఇంటికొచ్చిన లేడీ పోలీసులతో రెజీనా క్యారెక్టర్ ప్రవర్తించే తీరు, పదే పదే తలలు నరికే విజువల్స్ ఇవన్నీ మాస్ కేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ జడుసుకునేలా ఉన్నాయి. ప్రతిదానికి మాస్ ముద్ర వేయలేం. సమరసింహారెడ్డి, ఇంద్ర, అతనొక్కడే లాంటి సినిమాల్లో కూడా తలలు నరికే సీన్లుంటాయి. కానీ వాటి డైరెక్టర్లు ఒకటి రెండు షాట్లకు పరిమితం చేశారు. కానీ జాట్ లో రిపీట్ గా చూపించడం వల్ల ఒక వర్గం క్లాస్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
తమ హీరోతో చేయబోయే సినిమాలో జాట్ లా కాకుండా బాలయ్య మార్కు ఫార్ములా వాడాలని కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డిలోనూ సెకండాఫ్ పరంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వాల్తేరు వీరయ్య తర్వాత నిలవాల్సి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే జాట్ తరహా ట్రీట్ మెంట్ కన్నా రవితేజ క్రాక్ టైపు స్క్రీన్ ప్లేని రాసుకుంటే ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణకు ఇవ్వొచ్చు. సల్మాన్ ఖాన్ సికందర్ కంటే మేలే అనిపించుకున్నప్పటికీ జవాన్, గదర్ 2 స్థాయిలో జాట్ బ్లాక్ బస్టరయ్యే సూచనలు లేనట్టే. కాకపోతే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on April 12, 2025 1:12 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…