ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ప్రాజెక్టు ఓకే అయిపోయింది. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయితే జాట్ చూశాక వాళ్లలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. తనకు పట్టున్న మాస్ ఎలిమెంట్స్ మీద కాకుండా ఈసారి మలిలేని ఎక్కువగా విలనిజం, వయొలెన్స్ మీద దృష్టి పెట్టాడు. అసలు రణదీప్ హుడా పోషించిన పాత్రకు అవసరానికి మించిన నిడివి డిజైన్ చేసుకోవడం దగ్గరే పొరపాటు మొదలయ్యింది.
దీనికి తోడు హింస మోతాదు బాగా ఎక్కువయ్యింది. ఊళ్ళో యువకులు వేళ్ళు కోసుకుని ప్రెసిడెంట్ కు పంపడం, ఇంటికొచ్చిన లేడీ పోలీసులతో రెజీనా క్యారెక్టర్ ప్రవర్తించే తీరు, పదే పదే తలలు నరికే విజువల్స్ ఇవన్నీ మాస్ కేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ జడుసుకునేలా ఉన్నాయి. ప్రతిదానికి మాస్ ముద్ర వేయలేం. సమరసింహారెడ్డి, ఇంద్ర, అతనొక్కడే లాంటి సినిమాల్లో కూడా తలలు నరికే సీన్లుంటాయి. కానీ వాటి డైరెక్టర్లు ఒకటి రెండు షాట్లకు పరిమితం చేశారు. కానీ జాట్ లో రిపీట్ గా చూపించడం వల్ల ఒక వర్గం క్లాస్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
తమ హీరోతో చేయబోయే సినిమాలో జాట్ లా కాకుండా బాలయ్య మార్కు ఫార్ములా వాడాలని కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డిలోనూ సెకండాఫ్ పరంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వాల్తేరు వీరయ్య తర్వాత నిలవాల్సి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే జాట్ తరహా ట్రీట్ మెంట్ కన్నా రవితేజ క్రాక్ టైపు స్క్రీన్ ప్లేని రాసుకుంటే ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణకు ఇవ్వొచ్చు. సల్మాన్ ఖాన్ సికందర్ కంటే మేలే అనిపించుకున్నప్పటికీ జవాన్, గదర్ 2 స్థాయిలో జాట్ బ్లాక్ బస్టరయ్యే సూచనలు లేనట్టే. కాకపోతే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on April 12, 2025 1:12 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…