ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ప్రాజెక్టు ఓకే అయిపోయింది. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయితే జాట్ చూశాక వాళ్లలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. తనకు పట్టున్న మాస్ ఎలిమెంట్స్ మీద కాకుండా ఈసారి మలిలేని ఎక్కువగా విలనిజం, వయొలెన్స్ మీద దృష్టి పెట్టాడు. అసలు రణదీప్ హుడా పోషించిన పాత్రకు అవసరానికి మించిన నిడివి డిజైన్ చేసుకోవడం దగ్గరే పొరపాటు మొదలయ్యింది.
దీనికి తోడు హింస మోతాదు బాగా ఎక్కువయ్యింది. ఊళ్ళో యువకులు వేళ్ళు కోసుకుని ప్రెసిడెంట్ కు పంపడం, ఇంటికొచ్చిన లేడీ పోలీసులతో రెజీనా క్యారెక్టర్ ప్రవర్తించే తీరు, పదే పదే తలలు నరికే విజువల్స్ ఇవన్నీ మాస్ కేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ జడుసుకునేలా ఉన్నాయి. ప్రతిదానికి మాస్ ముద్ర వేయలేం. సమరసింహారెడ్డి, ఇంద్ర, అతనొక్కడే లాంటి సినిమాల్లో కూడా తలలు నరికే సీన్లుంటాయి. కానీ వాటి డైరెక్టర్లు ఒకటి రెండు షాట్లకు పరిమితం చేశారు. కానీ జాట్ లో రిపీట్ గా చూపించడం వల్ల ఒక వర్గం క్లాస్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
తమ హీరోతో చేయబోయే సినిమాలో జాట్ లా కాకుండా బాలయ్య మార్కు ఫార్ములా వాడాలని కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డిలోనూ సెకండాఫ్ పరంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వాల్తేరు వీరయ్య తర్వాత నిలవాల్సి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే జాట్ తరహా ట్రీట్ మెంట్ కన్నా రవితేజ క్రాక్ టైపు స్క్రీన్ ప్లేని రాసుకుంటే ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణకు ఇవ్వొచ్చు. సల్మాన్ ఖాన్ సికందర్ కంటే మేలే అనిపించుకున్నప్పటికీ జవాన్, గదర్ 2 స్థాయిలో జాట్ బ్లాక్ బస్టరయ్యే సూచనలు లేనట్టే. కాకపోతే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on April 12, 2025 1:12 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…