పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాటలు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం, దాని వల్ల ఆ టైంలో రావాలనుకున్న వేరేవి ప్రభావితం చెందటం పరిపాటిగా మారింది. విశ్వంభరని జూలై 24 రిలీజ్ చేయడం దాదాపు ఖరారయ్యిందనే లీక్ చక్కర్లు కొడుతోంది కానీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్ అయోమయాన్ని పెంచుతోంది. రేపు లాంచ్ కాబోతున్న రామ రామ సాంగ్ లో దీనికి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇండస్ట్రీ హిట్ ఇంద్ర వచ్చిన సెంటిమెంట్ డేట్ కాబట్టి ఫ్యాన్స్ దీన్నే బలంగా కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రవితేజ మాస్ జాతరకి జూలై 18 ఆప్షన్ చూస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. అదే కనక జరిగితే బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య అన్న తమ్ముళ్ల మధ్య కేవలం ఒక్క వారం మాత్రమే గ్యాప్ వస్తుంది. విచిత్రంగా ఈ రెండూ రకరకాల కారణాలతో పోస్టు పోన్ చేసుకుంటూ వచ్చినవే. మాస్ జాతరని మొన్న సంక్రాంతికి అనుకున్నారు. కానీ గత ఏడాది రవితేజ యాక్సిడెంట్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. భీమ్స్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి.
ఇక విశ్వంభర సంగతి తెలిసిందే. అచ్చం మాస్ జాతర లాగే సంక్రాంతి బరిని వదులుకుంది. పైకి గేమ్ ఛేంజర్ కోసం త్యాగమని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి అప్పటికి చాలా వర్క్ పెండింగ్ ఉంది. టీజర్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల విఎఫెక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోంది. ఫైనల్ గా జూలై 24 లాక్ చేస్తారో లేదో చూడాలి. అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ వచ్చే దాకా ఈ క్లాష్ మీద ముద్ర వేయలేం కానీ మరీ ఇంత తక్కువ గ్యాప్ అన్నా ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది కలగొచ్చు. చిరు, రవితేజ మధ్య బాండింగ్ దృష్ట్యా ఈ ఫేస్ టు ఫేస్ ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on April 11, 2025 2:42 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…