తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగులంటూ గాడిన పడుతోంది. షూటింగులు చేయడం వల్ల కొందరు కరోనా బారిన పడుతున్నా కానీ ఇక ఇలాంటి చెదురు మదురు సంఘటనలు తప్పవంటూ షూటింగ్స్ చేసేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్లు కూడా డిసెంబర్ మూడవ వారం నుంచీ షరా మామూలుగా నడుస్తాయనే ఆశాభావంతో వున్నారు. అయితే వివిధ దేశాలలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ మన నిర్మాతలను భయపెడుతోంది.
ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాలకు ఈ సెకండ్ వేవ్ ఆటంకంగా మారింది. అదే వేవ్ ఇండియాలో వస్తే పరిస్థితి ఎలా వుంటుందనే దానిపై పాండమిక్ నిపుణులకు కూడా ఐడియా లేదు.
ఈసారి వచ్చేది తీవ్రంగా వుండవచ్చునని కొందరు, ఆల్రెడీ మనకు క్రౌడ్ ఇమ్యూనిటీ మొదలయిపోయిందని కొందరు, మళ్లీ లాక్డౌన్ తప్పదని ఇంకొందరు వివిధ రకాల విశ్లేషణలతో ఊదరగొట్టేస్తున్నారు. అయితే సెకండ్ వేవ్ తీవ్రంగా వున్నట్టయితే మాత్రం ఆ తాకిడి తట్టుకునే శక్తి తెలుగు చిత్ర పరిశ్రమకు అసలు లేదు.
ఇప్పటికే నిర్మాతలు వెనకా ముందూ ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. జనవరికి అయినా సినిమా థియేటర్లు యథావిధిగా రన్ అవ్వకపోతే మాత్రం టాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని తెలుగు చలనచిత్ర ప్రముఖులే కంగారు పడుతున్నారు.
This post was last modified on November 1, 2020 2:48 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…