రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక ప్రమోషన్స్ పరంగా మంచి బూస్ట్ దక్కినట్టయ్యింది. యాంకర్ ప్రదీప్ సోలో హీరోగా నాలుగేళ్ళ క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చేశాడు. నీలి నీలి ఆకాశం పాట పుణ్యమాని ఓపెనింగ్స్ దక్కడంతో పాటు డీసెంట్ టాక్ తో కమర్షియల్ గా నిర్మాతను గట్టెక్కించింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కామెడీ గురించి ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో అదే రేపు పబ్లిక్ నుంచి కూడా వచ్చిందంటే సుడి తిరిగినట్టే. అసలు పాయింట్ ఇది కాదు.
టఫ్ కాంపిటీషన్ ఇస్తాయనుకున్న జాక్, గుడ్ బ్యాడ్ ఆగ్లీలకు మిశ్రమ స్పందన రావడం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కలిసి వచ్చేలా ఉంది. గురువారమే వచ్చిన మొదటి రెండు సినిమాలు బడ్జెట్, కంటెంట్ పరంగా చాలా పెద్దవి. సిద్దు జొన్నలగడ్డ, అజిత్ లతో పోలిస్తే ప్రదీప్ చిన్నవాడు. ఇమేజ్ లోనూ సరితూగడు. సో కంటెంట్ తో మెప్పించాల్సిందే. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ గానే అనిపించింది. మ్యాడ్ స్క్వేర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఖాళీ ఏర్పడింది. యూత్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి సరైన ఆప్షన్ లేదు. ఈ గ్యాప్ ని కనక ప్రదీప్ వాడుకుంటే ఒక రోజు అటుఇటుగా అయినా థియేటర్ పికప్ చూడొచ్చు.
ఎలాగూ చేతిలో ఒక వారం టైం ఉంటుంది. ఏప్రిల్ 17 ఓదెల టూ , 18 అర్జున్ సన్నాఫ్ వైజయంతి వస్తున్న నేపథ్యంలో మాస్ జనాల దృష్టి వీటివైపు వెళ్ళిపోతుంది. రెండు రోజుల గ్యాప్ లో 20న సారంగపాణి జాతకం ఉంది. ఆలోగానే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పని కానిచ్చేయాలి. నితిన్ – భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కి రధన్ సంగీతం సమకూర్చాడు. సినిమా మీద నమ్మకంతో హైదరాబాద్ లో ముందు రోజు రాత్రే కొన్ని షోలు వేస్తున్నారు. ఇది కనక క్లిక్ అయితే ప్రదీప్ కు మరికొన్ని అవకాశాలు వస్తాయి. కాకపోతే టీవీ వ్యాఖ్యాతగా థియేటర్లకు జనాన్ని రప్పించడం సవాలే.
This post was last modified on April 10, 2025 8:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…