పాండమిక్ కారణంగా తెలుగు సినిమా అతలాకుతలం కాగా, నిర్మాతలు ఆచితూచి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు లేని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో సినిమానే చేతులు మారిపోయిందంటే పరిస్థితి ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ టైమ్లో ఎవరయితే తమ పారితోషికం పరంగా ఫ్లెక్సిబుల్గా వున్నారో వారికే నిర్మాతలు ప్రాధాన్యమిస్తున్నారు.
సిట్యువేషన్ని సరిగ్గా అనలైజ్ చేసిన యువ హీరో శర్వానంద్ తన పారితోషికం బాగా తగ్గించుకున్నాడట. అందుకే ఇప్పుడు ఏ హీరోకీ లేనన్ని సినిమాలు అతడికి వున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇటీవల తన గ్రాఫ్ కూడా కాస్త డౌన్ అవడం వల్ల శర్వానంద్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వెనుకాడినట్టు లేడు.
శర్వానంద్ సినిమాలకు గ్యారెంటీ రిటర్నస్ అంటూ వుంటాయి కనుక రిస్క్ వున్న ఇతర హీరోల కంటే ఇతను బెస్ట్ అని ప్రొడ్యూసర్స్ ఇటు మొగ్గుతున్నారు. నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఇలా ఎవరయితే ఫ్లెక్సిబుల్గా వుంటారో వారికే ఫ్యూచర్ వుంటుందని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…