ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ షాట్ కూడిన విజువల్ ని విడుదల చేయడం, మాస్ కి వెంటనే ఎక్కేలా రామ్ చరణ్ ని చూపించిన విధానం భారీ స్పందన తెచ్చుకున్నాయి. వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు రీల్స్ లోనూ వేగంగా యూత్ కి పాకేస్తోంది. అయితే అందరూ అనుకున్నట్టు ఇది క్రికెట్ ని ప్రధాన అంశంగా రూపుదిద్దుకుంటున్న కథ కాదట. గతంలో ప్రచారం జరిగినట్టు ఈ ఆటతో పాటు కుస్తీ చాలా కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఈ ఎపిసోడ్స్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్.
ఇప్పటిదాకా షూట్ చేసింది కొంచెం అటు ఇటుగా ముప్పై శాతం మాత్రమే. ఇంతోటి దానికే దర్శకుడు బుచ్చిబాబు ఇన్ని ఎలివేషన్లు ఇస్తే మొత్తం కంటెంట్ లో ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లగాన్ తరహాలో క్రికెట్ ని ఎమోషన్, యాక్షన్ తో ముడిపెడుతూ తనదైన మార్కు హీరోయిజంతో చరణ్ పండించే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. తనతో పాటు జగపతిబాబు, దివ్యెందులున్న సీన్లు కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్రికెట్ కుస్తీతో పాటు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆడియన్స్ కి షాక్ ఇవ్వడం ఖాయమని వినికిడి. సో ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే రిలాక్స్ అవ్వడానికి లేదు.
ఇంకా ఏడాది సమయం ఉండగానే పెద్దికి ఈ స్థాయిలో హైప్ రావడం బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది. అగ్రిమెంట్లు ఇప్పుడప్పుడే క్లోజ్ చేసేందుకు మైత్రి,వృద్ధి నిర్మాతలు సుముఖంగా లేరట. ఇంకో నాలుగైదు నెలల తర్వాత అడ్వాన్సుల గురించి మాట్లాడుకుందామని బయ్యర్లకు చెప్పినట్టు తెలిసింది. పుష్ప, ఎన్టీఆర్ నీల్, హను రాఘవపూడి సినిమాల తర్వాత ఆ స్థాయి ప్యాన్ ఇండియా పొటెన్షియాలిటీ ఉన్న మూవీగా పెద్ది మీద మాములు బజ్ లేదు. హిందీలోనూ భారీ స్పందన రావడం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు. తిరిగి ఇంకో నాలుగైదు నెలల వరకు పెద్ది నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఉండకపోవచ్చు.
This post was last modified on April 10, 2025 6:34 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…