ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు చెక్ పెడుతూ జూన్ 27 థియేటర్లకు తీసుకొస్తున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించడంతో డౌట్లు తీరిపోయాయి. తాజాగా కుటుంబ గొడవల నేపథ్యంలో తన భైరవంకు భయపడే కన్నప్పని వాయిదా వేశారని మనోజ్ చెబుతున్న పరిస్థితిలో మరి ఇప్పుడు తన సినిమాని ఎప్పుడు తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. అన్నయ్యతో సమాంతరంగా రెండు నెలలు ఆగే సీన్ భైరవంకు ఉండకపోవచ్చు. పైగా అందులో మనోజ్ మెయిన్ హీరో కాదు.
ఈ సంగతలా ఉంచితే కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికిందని చెప్పాలి. ఇప్పటిదాకా ఆ నెలలో నోటెడ్ రిలీజు ఒక్క కుబేర మాత్రమే. 20కి లాక్ చేసుకుపోవడం తెలిసిందే. దాని తర్వాత వారం గ్యాప్ తో కన్నప్ప దిగుతాడు. ఇంకో డెబ్భై రోజులకు పైగా సమయం దొరకడంతో మంచు విష్ణుకి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం దొరికింది. ఇటీవలే కొంత ఫుటేజ్ ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్న కుటుంబ సభ్యులు, ఇతర యూనిట్ మెంబెర్స్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా పని చేయిస్తున్నట్టు తెలిసింది. ప్రభాస్ ఎపిసోడ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఇదే ముఖ్యమైంది.
ఇప్పటికిప్పుడు ప్రమోషన్లకు తొందరేం లేదు కాబట్టి మే నుంచి మొదలుపెట్టినా సరిపోతుంది. పబ్లిసిటీ పరంగా విష్ణు అందరికి భాగం దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ అందుబాటులో ఎప్పుడు వస్తాడనే దాన్ని బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు వగైరాలు పెట్టుకోవాలి. ఇక భైరవం సంగతి ఇంకో వారం పది రోజుల్లో తేలొచ్చు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. డిసెంబర్ నుంచి వాయిదాలు వేసుకుంటూ ఏప్రిల్ దాటిపోతున్నారు. వచ్చే నెల ఆప్షన్లు చూస్తున్నారు కానీ ఇంకా ఓటిటి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఎలా చూసుకున్నా రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే రావడం ఖాయం.
This post was last modified on April 9, 2025 5:07 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…