డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు సహా.. అనేక విషయాల్లో మంచు మనోజ్ వర్సెస్ మోహన్బాబు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇవి పోలీసుల కేసులు.. కోర్టుల జోక్యం వరకు వెళ్లాయి. తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరమీదికి వచ్చింది. తన కారును సోదరుడు మంచు విష్ణు దొంగిలించినట్టు.. మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తాము లేనప్పుడు.. తమ ఇంట్లోకి ప్రవేశించి.. వస్తువులు ధ్వంసం చేశారని తెలిపారు.
ఏం జరిగింది?
బుధవారం హైదరాబాద్ శివారు ప్రాంతం జల్పల్లిలోని డైలాగ్ కింగ్ ఇంటి వద్దకు ఆయన చిన్నకుమారు డు మనోజ్ వచ్చారు. అయితే.. ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే మనోజ్ కూర్చుని ధర్నాకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు.. రంగంలోకి దిగి భారీ భద్రతను కల్పించారు. చాలా సేపు మనోజ్ అక్కడే కూర్చున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంట్లోకి విష్ణు అక్రమంగా చొరబడ్డాడని ఆరోపించారు.
తాము ఇంట్లో లేని సమయంలో విష్ణు వచ్చి.. ఇంట్లో సామాగ్రిని ధ్వంసంచేసినట్టు మనోజ్ ఆరోపించారు. అదేసమయంలో తమ కారును టోయింగ్ వాహనం సాయంతో తీసుకువెళ్లి నడిరోడ్డుపై పడేశారని.. తెలిపారు. అయితే.. తాము ఫిర్యాదు చేయగానే.. సదరు వాహనం విష్ణు ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారని మనోజ్ కుమార్ చెప్పారు. అంతేకాదు.. జల్పల్లిలో తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. అయితే.. తాజా వివాదంపై మోహన్ బాబు కానీ, విష్ణు కానీ.. స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on April 9, 2025 2:07 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…