జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్ రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ట్వీట్లు వచ్చేశాయి. అయితే అది దేని గురించనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ముందు చెప్పినట్టు విడుదలని 2026 సంక్రాంతికి కాకుండా ఒక మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ లో తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 లాక్ చేశారని, అదే రేపు ప్రకటన రూపంలో వెలువడే ఛాన్స్ ఉందట. అంటే సరిగ్గా పన్నెండు నెలల తర్వాత వస్తుందన్న మాట.
దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ఇదే టైటిల్ తో చేసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. తిరిగి అదే పెట్టుకుంటే ఇబ్బంది కావొచ్చు. తెలుగు డబ్బింగ్ కి రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టి మేనేజ్ చేశారు కానీ జనం మెదడులో మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగా రిజిస్టర్ అయిపోయింది. సరే దీని సంగతలా ఉంచితే ఏప్రిల్ 9 చాలా మంచి డేట్. వేసవి సీజన్ తో పాటు వరస సెలవులు కలిసి వస్తాయి. గతంలో కెజిఎఫ్ 2 కూడా ఇదే నెలలో వచ్చి ఆల్ ఇండియా లెవల్ లో భారీ వసూళ్లు దక్కించుకుంది.
ఇప్పటికైతే ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ పెద్ద సినిమాలు ఖచ్చితంగా చెప్పిన మాటకే కట్టుబడి అదే డేట్ కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. వాయిదాలు టాలీవుడ్ లో మాములు ప్రహసనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న తారక్ నీల్ వంద శాతం వస్తారా అంటే నిర్మాతలు సైతం చెప్పలేరు. ప్లానింగ్ అయితే పక్కాగా దానికి అనుగుణంగానే జరుగుతోంది. ఇది పూర్తి చేసి దేవర 2 మొదలు పెట్టాలనేది తారక్ – కొరటాల శివ ప్రణాళిక. అంటే ఫిబ్రవరి లోగా నీల్ మూవీని కంప్లీట్ చేయగలిగితే ఒక నెల ప్రమోషన్ల కోసం కేటాయించవచ్చు. ఏదైతేనేం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతోంది.
This post was last modified on April 8, 2025 10:33 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…