Movie News

ఎన్టీఆర్ నీల్ – మారిన విడుదల తేదీ ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్ రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ట్వీట్లు వచ్చేశాయి. అయితే అది దేని గురించనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ముందు చెప్పినట్టు  విడుదలని 2026 సంక్రాంతికి కాకుండా ఒక మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ లో తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 లాక్ చేశారని, అదే రేపు ప్రకటన రూపంలో వెలువడే ఛాన్స్ ఉందట. అంటే సరిగ్గా పన్నెండు నెలల తర్వాత వస్తుందన్న మాట.

దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ఇదే టైటిల్ తో చేసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. తిరిగి అదే పెట్టుకుంటే ఇబ్బంది కావొచ్చు. తెలుగు డబ్బింగ్ కి రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టి మేనేజ్ చేశారు కానీ జనం మెదడులో మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగా రిజిస్టర్ అయిపోయింది. సరే దీని సంగతలా ఉంచితే ఏప్రిల్ 9 చాలా మంచి డేట్. వేసవి సీజన్ తో పాటు వరస సెలవులు కలిసి వస్తాయి. గతంలో కెజిఎఫ్ 2 కూడా ఇదే నెలలో వచ్చి ఆల్ ఇండియా లెవల్ లో భారీ వసూళ్లు దక్కించుకుంది.

ఇప్పటికైతే ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ పెద్ద సినిమాలు ఖచ్చితంగా చెప్పిన మాటకే కట్టుబడి అదే డేట్ కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. వాయిదాలు టాలీవుడ్ లో మాములు ప్రహసనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న తారక్ నీల్ వంద శాతం వస్తారా అంటే నిర్మాతలు సైతం చెప్పలేరు. ప్లానింగ్ అయితే పక్కాగా దానికి అనుగుణంగానే జరుగుతోంది. ఇది పూర్తి చేసి దేవర 2 మొదలు పెట్టాలనేది తారక్ – కొరటాల శివ ప్రణాళిక. అంటే ఫిబ్రవరి లోగా నీల్ మూవీని కంప్లీట్ చేయగలిగితే ఒక నెల ప్రమోషన్ల కోసం కేటాయించవచ్చు. ఏదైతేనేం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతోంది.

Kumar

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

47 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago