జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్ రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ట్వీట్లు వచ్చేశాయి. అయితే అది దేని గురించనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ముందు చెప్పినట్టు విడుదలని 2026 సంక్రాంతికి కాకుండా ఒక మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ లో తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 లాక్ చేశారని, అదే రేపు ప్రకటన రూపంలో వెలువడే ఛాన్స్ ఉందట. అంటే సరిగ్గా పన్నెండు నెలల తర్వాత వస్తుందన్న మాట.
దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ఇదే టైటిల్ తో చేసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. తిరిగి అదే పెట్టుకుంటే ఇబ్బంది కావొచ్చు. తెలుగు డబ్బింగ్ కి రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టి మేనేజ్ చేశారు కానీ జనం మెదడులో మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగా రిజిస్టర్ అయిపోయింది. సరే దీని సంగతలా ఉంచితే ఏప్రిల్ 9 చాలా మంచి డేట్. వేసవి సీజన్ తో పాటు వరస సెలవులు కలిసి వస్తాయి. గతంలో కెజిఎఫ్ 2 కూడా ఇదే నెలలో వచ్చి ఆల్ ఇండియా లెవల్ లో భారీ వసూళ్లు దక్కించుకుంది.
ఇప్పటికైతే ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ పెద్ద సినిమాలు ఖచ్చితంగా చెప్పిన మాటకే కట్టుబడి అదే డేట్ కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. వాయిదాలు టాలీవుడ్ లో మాములు ప్రహసనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న తారక్ నీల్ వంద శాతం వస్తారా అంటే నిర్మాతలు సైతం చెప్పలేరు. ప్లానింగ్ అయితే పక్కాగా దానికి అనుగుణంగానే జరుగుతోంది. ఇది పూర్తి చేసి దేవర 2 మొదలు పెట్టాలనేది తారక్ – కొరటాల శివ ప్రణాళిక. అంటే ఫిబ్రవరి లోగా నీల్ మూవీని కంప్లీట్ చేయగలిగితే ఒక నెల ప్రమోషన్ల కోసం కేటాయించవచ్చు. ఏదైతేనేం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతోంది.
This post was last modified on April 8, 2025 10:33 pm
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…