కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని పట్టుబట్టి కూర్చుంటారు. ఇలా పట్టుదలకు పోయి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో రావాల్సిన ‘రైతు’ సినమాను ఇలాగే ఆపేశారు. అమితాబ్ బచ్చన్ను ఓ ముఖ్య పాత్రలో నటింపజేయడానికి ఆయనతో సంప్రదింపులు జరిపింది ఈ జోడీ. కానీ అమితాబ్ ఆ పాత్ర చేయలేకపోవడంతో సినిమానే ఆపేశారు.
వర్తమానంలోకి వస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విషయంలో కూడా ఇలాంటి కండిషనే పెట్టాడట. ఇందులో విజయశాంతి.. కళ్యాణ్ రామ్ తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐతే తన తల్లిగా వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కళ్యాణ్ రామ్.. విజయశాంతి తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాడట. ఆమె ఈ పాత్ర చేస్తేనే సినిమా ఉంటుందని.. లేదంటే లేదని తేల్చేశాడట. ఇదే విషయంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తన దగ్గర చెప్పినట్లు విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మీరు సినిమా చేయండి లేదంటే తన కెరీర్ పోతుంది అంటూ అతను వేడుకున్నట్లు విజయశాంతి తెలిపారు. ఐతే అతను అలా చెప్పాడని కాకుండా, తన పాత్ర ఎంతో నచ్చి ఈ సినిమా చేసినట్లు విజయశాంతి వెల్లడించారు. తన కమ్ బ్యాక్కు ఇది సరైన పాత్ర, సినిమా అని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లీ కొడుకుల పాత్రలే అయినప్పటికీ.. వక్రమార్గంలో వెళ్తున్న కొడుకుతో ఢీకొట్టే పాత్ర కావడం, అదే సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ కావడం ఈ సినిమాలో ప్రత్యేకత. కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటించిన ఈ చిత్రం.. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…