ప్రస్తుతం బాలీవుడ్ స్టార్లు ఒక్కొక్కరుగా సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శకులకు అక్కడ మాంచి డిమాండ్ ఏర్పడింది. ఓవైపు తెలుగు దర్శకులు రూపొందించిన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతుంటే.. మరోవైపు సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడమే ఈ డిమాండుకు కారణం.
ఇంకొన్ని రోజుల్లోనే గోపీచంద్ మలినేని రూపొందించిన తొలి బాలీవుడ్ మూవీ ‘జాట్’ ప్రేక్షకులను పలకరించబోతోంది. తన బాటలోనే మరో తెలుగు దర్శకుడు హిందీలో ఓ భారీ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో హిట్లు కొట్టిన బాబీ.. అతి త్వరలో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలిసింది.
‘డాకు మహారాజ్’ తర్వాత బాబీ కొంచెం గ్యాప్ తీసుకుని.. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ను కలిశాడు. బాబీ చెప్పిన కథకు ప్రాథమికంగా అంగీకారం తెలిపాడట హృతిక్. ఇంకా పూర్తి స్క్రిప్టు చెప్పాల్సి ఉంది. స్టోరీ లైన్ మాత్రం హృతిక్కు నచ్చింది. సినిమా చేయడానికి ఓకే అన్నాడట. ఇక పూర్తి స్క్రిప్టు చేసుకుని వెళ్లి మళ్లీ హృతిక్ను కలవబోతున్నాడు బాబీ. హృతిక్ రెండోసారి కూడా ఓకే చెబితే.. ఈ సినిమా పట్టాలెక్కినట్లే.
తమ బేనర్లో ‘వీరసింహారెడ్డి’ చేశాక గోపీచంద్ను ‘జాట్’తో బాలీవుడ్కు పరిచయం చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే.. ‘వాల్తేరు వీరయ్య’తో తమకు సక్సెస్ అందించిన బాబీతో బాలీవుడ్ మూవీ చేసే అవకాశముంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాబీ.. హృతిక్తో కూడా తన మార్కు సినిమానే తీసే అవకాశముంది.
This post was last modified on April 7, 2025 3:16 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…