Movie News

శంకర్.. ఇప్పుడేం చేయబోతున్నాడు?

ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్లుగా ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. ఐ, ఇండియన్-2 లాంటి డిజాస్టర్లు ఆయన్ని కిందికి లాగేశాయి. ‘2.0’ మంచి ఓపెనింగ్సే సాధించినా.. అది కూడా నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది. ఈ స్థితిలో ‘గేమ్ చేంజర్’ మీదే ఆయన ఆశలన్నీ నిలిచాయి. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. ‘ఇండియన్-2’తో పోలిస్తే ఇది బెటర్ అన్న టాక్ వచ్చింది తప్ప.. సినిమా ఆడలేదు. మరోవైపు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసి.. ఓ 30 శాతం షూట్ పెండింగ్‌లో ఉన్న ‘ఇండియన్-3’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు దీని మీద నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, శంకర్‌కు మధ్య వివాదం కూడా నడిచింది. ఆ సినిమాను మధ్యలో వదిలేయడంపై ఆ సంస్థ శంకర్ మీద ఫిర్యాదు చేసింది. ఐతే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ తర్వాత చూద్దామని ఆ గొడవను సర్దుబాటు చేసుకున్నాడు శంకర్. ఇప్పుడు చూస్తే ‘గేమ్ చేంజర్’ కూడా డిజాస్టర్ అయింది. మరోవైపు లైకా సంస్థ దివాళా దశకు వచ్చింది. వరుసగా వాళ్ల సినిమాలు భారీ నష్టాలు మిగల్చడంతో నిర్మాణమే ఆపేసే స్థితికి వచ్చింది లైకా. ‘ఇండియన్-3’ మీద ప్రేక్షకులకు ఏమాత్రం ఆశలూ లేవు. దానికి బిజినెస్ జరిగే పరిస్థితీ లేదు. అలా అని ఆల్రెడీ వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను అలా వదిలేయలేరు. అందుకే లైకా ప్రతినిధులు, శంకర్ ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పరిమిత బడ్జెట్లో మిగతా 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం కమల్ నుంచి నెల రోజుల కాల్ షీట్స్ కూడా అడుగుతున్నారట. ఎవ్వరికీ సినిమా మీద ఆశలు లేకపోయినా.. పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఎంతో కొంత ఆదాయం వచ్చి నష్టాలు రికవర్ అవుతాయని భావిస్తున్నారు. శంకర్ కొత్త ప్రాజెక్టు ఏదీ ఎంచుకోకుండా ఇండియన్-3ని పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on April 4, 2025 5:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

2 minutes ago

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

47 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

1 hour ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

3 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

3 hours ago