Movie News

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకుంది. కేరళ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఆఫ్రికాలో ప్లాన్ చేసుకున్న లాంగ్ షెడ్యూల్ కు అనుమతులు, వీసాలు కుదరగానే ప్రయాణం తేదీని నిర్ణయించబోతున్నారు.  ఇప్పటిదాకా ఫిక్స్ అయిన క్యాస్టింగ్ లో పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పేర్లు మాత్రమే బయటికి రాగా ఇంకెవరెవరు ఉన్నారనేది గుట్టుగానే ఉంది. ఇదిలా ఉండగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ ప్యాన్ వరల్డ్ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో రాజమౌళి లేరట. కాస్త నిడివి ఎక్కువైనా సరే యానిమల్, పుష్ప తరహాలో ఓ మూడున్నర గంటలు సెట్ చేసినా పర్వాలేదు కానీ సీక్వెల్ కోసం ప్రయాస అవసరం లేదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అసలీ సినిమా మొదలుకాక ముందే పార్ట్ 2 గట్రాలు వద్దనుకున్నారని సమాచారం. అయితే అధికారికంగా ఏదీ ఇంకా బయటికి చెప్పలేదు కాబట్టి నిర్ధారణకు రాలేం కానీ అభిమానులు, సినీ ప్రియులు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ కాలేదు. ఓ రెండు నిమిషాల వీడియోని సిద్ధం చేసి ప్రాజెక్టుని ప్రకటించే ప్రణాళిక రెడీ అవుతోందట. అది ఎప్పుడనేది జక్కన్న చెబితే తప్ప కనీసం లీక్ అవ్వడం కూడా కష్టమే. మహేష్ బాబు విదేశీ పర్యటనలు దూరం పెట్టి మరీ రాజమౌళి కోసం అంకితమైపోయాడు. 2027 విడుదల చేయాలనేది నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ లక్ష్యం. చూస్తుంటే సాధ్యమయ్యేలానే ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ కి మైథలాజి జోడించి విజయేంద్రప్రసాద్ చాలా పవర్ ఫుల్ స్టోరీ ఇచ్చారట. వెయ్యి కోట్ల విజువల్ గ్రాండియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Kumar

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago