జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారి జపాన్ దేశానికి వెళ్లి ప్రత్యేకంగా ప్రమోట్ చేసిన దేవర మొన్న మార్చి 28 విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసమే ప్రత్యేకంగా తారక్ తో పాటు దర్శకుడు కొరటాల శివ అక్కడి పబ్లిసిటీలో భాగమయ్యారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాక ఫ్యాన్స్ మీట్స్ నిర్వహించి ప్రత్యేకంగా కబుర్లు పంచుకున్నారు. ఫోటో షూట్ తాలూకు పిక్స్ వైరలయ్యాయి. కాకపోతే కల్కికి పెద్దగా స్పందన దక్కని నేపథ్యంలో దేవరకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం గొప్పగా లేదు కానీ డీసెంట్ గా నడుస్తోందట.
జపాన్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవర మొదటి రెండు రోజుల్లో 11 మిలియన్ యెన్లు (అక్కడి కరెన్సీ) వసూలు చేసింది. సుమారు 6200 మంది దాకా థియేటర్లకొచ్చి దేవరని చూశారు. అయితే లాంగ్ రన్ లో ఇది కొనసాగితేనే బ్లాక్ బస్టర్ ముద్ర పడుతుంది. ఇప్పటిదాకా హయ్యెస్ట్ లెక్కలు చూస్తే ఆర్ఆర్ఆర్ (2.42 బిలియన్), ముత్తు (405 మిలియన్), బాహుబలి 2 (305 మిలియన్) తో టాప్ త్రీ పొజిషన్లలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఉన్నవన్నీ 200 మిలియన్ లోపే ఉన్నవి. ఇప్పుడు దేవర ఇంకా ప్రారంభంలోనే ఉంది కానీ 11 అనేది రేంజ్ ప్రకారం చూసుకుంటే చిన్న నెంబరే.
ప్రస్తుతానికి తారక్ హ్యాపీగానే ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతోంది. జపాన్ ఫైనల్ రన్ పూర్తయితే తప్ప స్టేటస్ డిసైడ్ చేయలేం కానీ ఇంకా మెరుగ్గా కలెక్షన్లు ఉండాల్సిందన్న మాట వాస్తవం. దేవర 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఉంటుందా లేదానే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే వార్ 2 అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది కాగానే నెల్సన్ దిలీప్ కుమార్ ప్యాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఇవన్నీ అయ్యేలోగా రెండు మూడేళ్లు గడిచిపోతాయి. మరి దేవర 2 అప్పటిదాకా ఎదురు చూస్తే ఈ హైప్ తగ్గొచ్చు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on April 3, 2025 2:13 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…