డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరస బ్లాక్ బస్టర్లు ఇచ్చాక ఏడాది పైనే గ్యాప్ వచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా జాక్ ఏప్రిల్ 10 విడుదలకు రెడీ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా సిద్ధూ మొదటిసారి లవ్, రొమాంటిక్ జానర్ నుంచి బయటికి వచ్చి సీరియస్ టర్న్ తీసుకున్నాడు. అలాని ఫన్ వదిలేయలేదు కానీ కొత్తగా అయితే ట్రై చేస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ ద్వారా ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో గుట్టు విప్పేశారు.
దేశంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా వివిధ ప్రాంతాల్లో నలుగురు కరుడు గట్టిన టెర్రరిస్టులు పాతుకుని పోయి కుట్రలకు ప్లాన్ చేస్తారు. ఇది తెలుసుకున్న సీక్రెట్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ (ప్రకాష్ రాజ్) వాళ్ళను పట్టుకునే లక్ష్యంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకోవైపు బయటి ప్రపంచానికి జాలిగా కనిపించే జాక్ (సిద్ధూ జొన్నలగడ్డ) రకరకాల మరువేషాలతో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఓ అమ్మాయి (వైష్ణవి చైతన్య) ని ప్రేమలో కూడా పడేస్తాడు. అసలు జాక్ కి ఈ మిషన్ కి సంబంధం ఏంటి, కనిపించకుండా గొంతులు కోసే తీవ్రవాదులను పట్టుకోవడంలో ఏం చేశాడనేది ఇంకో వారంలో తెరమీద చూడాలి.
కంటెంట్ పరంగా జాక్ లో వైవిధ్యం కనిపిస్తోంది. తీసుకున్నది తీవ్రమైన బ్యాక్ డ్రాపే అయినా సిద్దు మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్దు చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేష్ తో పండించిన హాస్యం యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా అచ్చురాజమణి పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయాయి. కొంచెం క్రాక్ క్యాప్షన్ పెట్టుకుని వస్తున్న జాక్ అంచనాలు రేపడంలో సక్సెసయ్యాడు. ఇక సినిమాతో మెప్పించడమే మిగిలింది.
This post was last modified on April 3, 2025 11:20 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…