ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ను రెండు దశాబ్దాలకు పైగా ఏలుతూ వచ్చిన సూపర్ స్టార్లు. అమితాబ్ బచ్చన్ హవా తగ్గాక ఇండియన్ బాక్సాఫీస్లో వీరిదే హవా. ఖాన్ త్రయంలో ఎవరికి వాళ్లు భారీ విజయాలందుకుని తమకు తామే సాటి అని రుజువు చేశారు. ఐతే వీరిలో షారుఖ్ ఖాన్ ఒక దశలో వరుస డిజాస్టర్లలో అల్లాడిపోయాడు. ఆయన కెరీర్కు ‘పఠాన్’ మళ్లీ ఊపిరి పోసింది. జవాన్ సైతం బ్లాక్ బస్టర్ అయింది. ‘డంకీ’ ఓ మోస్తరుగా ఆడింది. కానీ మిగతా ఇద్దరు ఖాన్స్ మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
‘దంగల్’ తర్వాత ఆమిర్ ఖాన్కు హిట్ లేదు. మూడేళ్లకో సినిమా చేసే ఆమిర్.. కష్టపడి చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ‘లాల్ సింగ్ చడ్డా’కు అయితే మినిమం ఓపెనింగ్స్ లేవు. ఆయన స్టార్ డమ్ అంతా ఏమైందో అనిపించేలా ఘోరమైన ఫలితాన్నందుకుందీ చిత్రం.
ఈ దెబ్బతో ఆమిర్ హీరోగా కొత్త సినిమానే మొదలుపెట్టలేదు. రెండేళ్ల పాటు అసలు సినిమాలకే దూరమైపోయాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘సితారే జమీన్ పర్’ తీస్తున్న ఆమిర్.. హీరోగా మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడో తెలియని పరిస్థితి. ఇక సల్మాన్ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. ఆయన చివరగా ఎప్పుడు నిఖార్సయిన హిట్ కొట్టాడో కూడా ఫ్యాన్స్కు గుర్తు లేదు. తన సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ కండల వీరుడి చివరి చిత్రం ‘కిసీ కా భాయ్ కిసి కీ జాన్’ డిజాస్టరే. లేటెస్ట్ మూవీ ‘సికందర్’ ఫలితం చూశాక ముందు సినిమాలే నయం అనిపిస్తోంది. సల్మాన్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది.
తొలి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత సినిమా చతికిలపడింది. ఇంతకుముందులా బాలీవుడ్ ప్రేక్షకులు స్టార్ల ముఖాలు చూసి సినిమాలకు ఎగబడే పరిస్థితి లేదనడానికి ‘సికందర్’ రుజువు. వారం తిరక్కముందే జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఆమిర్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’కు సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్లుగా పేరు తెచ్చుకున్న హీరోలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
This post was last modified on April 1, 2025 7:32 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…