రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా పడ్డాక ఎట్టకేలకు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ ‘రాబిన్ హుడ్’ కూడా బాగానే దోచుకున్నాడు. కానీ అతను దోపిడీ చేసింది నిర్మాతలు, బయ్యర్ల దగ్గరే. ప్రేక్షకులను మాత్రం ఆశించినంతగా దోచుకోలేకపోయాడు. దీంతో లెక్క తప్పి నిర్మాతలు, బయ్యర్లు గట్టి దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. నితిన్ మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమా మీద చాలా ఎక్కువే ఖర్చు పెట్టేశారు. 70-80 కోట్ల దాకా బడ్జెట్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా సరే.. ‘భీష్మ’ కాంబినేషన్ కావడంతో వెంకీ కుడుముల మీద భరోసాతో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు బడ్జెట్ కొంచెం ఎక్కువే పెట్టారు. సినిమా ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడడం వల్ల బడ్జెట్ ఇంకా పెరిగింది. దీంతో ‘రాబిన్ హుడ్’ మీద బాక్సాఫీస్ భారం బాగా పెరిగిపోయింది.
పైగా మార్చి చివరి వారంలో తీవ్రమైన పోటీ మధ్య సినిమా రిలీజైంది. ఓవైపు మ్యాడ్ స్క్వేర్.. ఇంకోవైపు ఎంపురాన్, వీర ధీర శూర.. ఇలా రెండు వైపులా పోటీ తప్పలేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ క్రేజ్ ‘రాబిన్ హుడ్’ను బాగానే దెబ్బ తీసింది. దానికి కూడా యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు బాగున్నాయి. ‘ఎంపురాన్’, ‘వీర ధీర శూర’ కూడా కొంతమేర డ్యామేజ్ చేశాయి. ఇటు చూస్తే ‘రాబిన్ హుడ్’కు బ్యాడ్ టాక్ వచ్చింది. దీంతో సినిమా రేసులో బాగా వెనుకబడిపోయింది.
తొలి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ సాధించిన నితిన్ సినిమా.. రెండో రోజే పడుకుంది. ఆదివారం కలెక్షన్లు పర్వాలేదు. మొత్తంగా చూస్తే వీకెండ్లోనే సినిమా అండర్ పెర్ఫామ్ చేసింది. ఇక సోమవారం నుంచి సినిమా మీద పెద్దగా ఆశలు లేనట్లే కనిపిస్తోంది. రంజాన్ సెలవైనా సరే సోమవారం బుకింగ్స్ చాలా డల్లుగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే బయ్యర్ల పెట్టుబడిలో సగం కూడా రికవర్ అయ్యేలా లేదు. ‘పుష్ప-2’ భారీ సక్సెస్ సాధించడంతో జోష్ మీద ఉన్న మైత్రీ అధినేతలకు ‘రాబిన్ హుడ్’ బాగానే గండి కొట్టేలా ఉంది.
This post was last modified on March 31, 2025 9:08 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…