‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేయడమంటే అంత తేలికైన విషయమేమీ కాదు. కంటెస్టెంట్లు అందరి మీదా ఒక అవగాహన ఉండాలి. వీకెండ్ ఎపిసోడ్ను హోస్ట్ చేయాలంటే.. ఆ వారంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. షో వ్యవహారం మీద అవగాహన ఉండాలి. టాస్కులు, ఇతర విషయాల మీద కూడా పట్టుండాలి. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం ఇవేవే తెలియకుండానే షోను హోస్ట్ చేసేసిందట. ఈ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించడం విశేషం.
గత సీజన్తో పాటు ఈసారి కూడా ‘బిగ్ బాస్’కు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం అనివార్యంగా ‘బిగ్ బాస్’కు కొన్ని వారాలు దూరం కావాల్సి రావడంతో నాగార్జున స్థానంలోకి సమంత వచ్చింది. గత వారం ఆమే షోను హోస్ట్ చేసింది. ఆమె హోస్టింగ్ స్కిల్స్ సూపర్ అనలేం. అలా అని తీసిపడేయలేం. ఓకే అనిపించింది. ఐతే ఏమాత్రం అనుభవం లేకుండా, బిగ్ బాస్ షో మీద అవగాహన లేకుండా సమంత ఈ మాత్రం నడిపించిందంటే గొప్ప విషయమే.
ఈ అనుభవం గురించి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది.
‘‘ఇది ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ అనుభవం. బిగ్బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మా మావయ్య వల్లే హోస్ట్గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే ముందు ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్గా చేయలేదు. నాకు తెలుగు పెద్దగా రాదు. అంతే కాదు.. ఇంతకుముందు బిగ్బాస్కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అయినా నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామా. అలాగే ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని సమంత పేర్కొంది.
This post was last modified on October 30, 2020 10:27 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…