బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడం కోసం నిర్మాతలు ఆ డేట్ మీద పెద్ద కన్నే వేశారు. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ఒక రోజు ముందు అంటే ఆగస్ట్ 14 వస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న కాసిన్ని అనుమానాలను నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఇటీవలే నివృత్తి చేసింది. ఖచ్చితంగా చెప్పిన తేదీకే వస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలికి వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు నిర్మాతలు. కానీ ఒక కన్నడ ప్యాన్ ఇండియా మూవీ ఐ డోంట్ కేర్ అంటూ క్లాష్ కి సిద్ధపడుతోంది.
శాండల్ వుడ్ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన 45 టీజర్ ఇవాళ వచ్చింది. నిమిషం వీడియోలో ఎంత వెరైటీ కంటెంట్ ఇవ్వబోతున్నారో శాంపిల్ చూపించారు. వీళ్ళతో పాటు రాజ్ బి శెట్టి కూడా ఒక ప్రధాన పాత్ర చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 15 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే వార్ 2 ఉందని తెలిసి కూడా రిస్క్ చేస్తున్నారంటే చాలా బలమైన నమ్మకం ఉన్నట్టేగా. అర్జున్ జన్య సంగీతం, రచన , దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ సైకాలజిక్ థ్రిల్లర్ చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఈ లెక్కన వార్ 2 రావడం గురించి కొన్ని అనుమానాలు ఇతర ఇండస్ట్రీలలో ఉన్న విషయం అర్థమవుతోంది. ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుకావడం చూస్తే ఆ సీజన్ ఎంత ముఖ్యమైందిగా మారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇక కూలీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఆగస్ట్ చివరి వారం వైపు కన్నేస్తోంది. సన్ పిక్చర్స్ మాత్రం ఒకవేళ వార్ 2 కనక చివరి నిమిషంలో తప్పుకుంటే కూలిని రిలీజ్ చేయాలనే ఆప్షన్ తో రెడీ అవుతోంది. ఈ లెక్కలేవి వేసుకోకుండా 45 ఇంత ధైర్యంగా డేట్ వేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగుతో సహా మొత్తం అయిదు భాషల్లో దీన్ని తీసుకొస్తున్నారు.
This post was last modified on March 30, 2025 9:04 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…