Movie News

ఫ్యామిలీ మ్యాన్-3… స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన భారీ సిరీస్‌లు చాలా ఉన్నాయి కానీ.. కంటెంట్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ పరంగా చూస్తే ఇదే నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుంది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది. తర్వాత రెండో సీజన్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్‌లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండో సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లడానికి కొంచెం టైం పట్టింది.

గత ఏడాది చివర్లో షూట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం జోరుగా చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్-2 గురించి హీరో మనోజ్ బాజ్‌పేయి రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చాడు ఓ ఇంటర్వ్యూలో. ‘పాతాళ్ లోక్’తో మంచి పేరు సంపాదించిన జైదీప్ అహ్లావత్ ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడట. గత ఏడాదే అతను షూట్‌లో జాయిన్ అయ్యాడని.. తన పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని మనోజ్ తెలిపాడు.

ఇక ఈ సిరీస్ రిలీజ్‌ టైమింగ్‌ను కూడా మనోజ్ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబరు నుంచి అమేజాన్ ప్రైమ్ వాళ్లు దీన్ని స్ట్రీమ్ చేస్తారన్నాడు. పార్ట్-3 అరుణాచల్ ప్రదేశ్ నేపథ్యంలో సాగుతుందని.. చైనా వాళ్లతో హీరో పోరాడతాడని సెకండ్ పార్ట్ చివర్లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ స్ట్రీమ్ అయినపుడు ఓటీటీ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు. జైదీప్ కూడా తోడవుతుండడంతో ఈ సిరీస్ హైప్ ఇంకో లెవెల్‌కు చేరడం ఖాయం.

This post was last modified on March 29, 2025 11:02 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Family Man 3

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago