ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన భారీ సిరీస్లు చాలా ఉన్నాయి కానీ.. కంటెంట్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ పరంగా చూస్తే ఇదే నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుంది. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది. తర్వాత రెండో సీజన్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండో సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లడానికి కొంచెం టైం పట్టింది.
గత ఏడాది చివర్లో షూట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం జోరుగా చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్-2 గురించి హీరో మనోజ్ బాజ్పేయి రెండు క్రేజీ అప్డేట్స్ ఇచ్చాడు ఓ ఇంటర్వ్యూలో. ‘పాతాళ్ లోక్’తో మంచి పేరు సంపాదించిన జైదీప్ అహ్లావత్ ఈ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్నాడట. గత ఏడాదే అతను షూట్లో జాయిన్ అయ్యాడని.. తన పాత్ర చాలా స్పెషల్గా ఉంటుందని మనోజ్ తెలిపాడు.
ఇక ఈ సిరీస్ రిలీజ్ టైమింగ్ను కూడా మనోజ్ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబరు నుంచి అమేజాన్ ప్రైమ్ వాళ్లు దీన్ని స్ట్రీమ్ చేస్తారన్నాడు. పార్ట్-3 అరుణాచల్ ప్రదేశ్ నేపథ్యంలో సాగుతుందని.. చైనా వాళ్లతో హీరో పోరాడతాడని సెకండ్ పార్ట్ చివర్లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ స్ట్రీమ్ అయినపుడు ఓటీటీ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు. జైదీప్ కూడా తోడవుతుండడంతో ఈ సిరీస్ హైప్ ఇంకో లెవెల్కు చేరడం ఖాయం.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…