రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి. సౌత్ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్, విజయ్, సూర్య సినిమాలను నార్త్ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారని, కానీ దక్షిణాదిలో మాత్రం తనను భాయ్ భాయ్ అంటూ థియేటర్లకు మాత్రం రావడం లేదని అన్నాడు. అంటే తమ మీద ఇష్టం కేవలం బయటికి పరిమితమవుతుందని, అంతే తప్ప కలెక్షన్లుగా మారడం లేదని కండల వీరుడి సారాంశం. అయితే వినడానికి బాగానే ఉంది కానీ సల్మాన్ ఖాన్ కొన్ని కీలకమైన లాజిక్స్ మిస్ అవుతున్నాడు.
తెలుగు ఆడియన్స్ హిందీ చిత్రాలను ఆదరించడం ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ లో డాన్, షోలే, దీవార్ లాంటి బ్లాక్ బస్టర్లు సాధించిన రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. హం ఆప్కే హై కౌన్ డబ్బింగ్ వెర్షన్ వైజాగ్ లాంటి కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడటం గురించి అప్పటి ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే కింది స్థాయి సెంటర్లలో హండ్రెడ్ డేస్ ఆడింది. సరే అవన్నీ పాతవి అనుకుంటే జవాన్, పఠాన్ లు నమోదు చేసిన వసూళ్లు చిన్నవి కాదు. యానిమల్ ని నెత్తిన బెట్టుకున్నది మనమే. తీసింది కూడా మన దర్శకుడే. వీటికి సమాధానం సల్మానే చెప్పాలి.
కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆదరించడం సౌత్ ప్రేక్షకులకు తరాల నుంచి వస్తున్న సినిమా ప్రేమ. ఇవన్నీ కాదు సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ కు మనోళ్లు ఎంత భారీ వసూళ్లు ఇచ్చారో ఒక్కసారి కలెక్షన్ ఛార్ట్ తీసి చూస్తే అర్థమవుతుంది. బాలేనప్పుడు మనకు సూపర్ స్టార్ అయినా ఒకటే భాయ్ జాన్ అయినా ఒకటే. రేస్ 3, ట్యూబ్ లైట్, రాధే, కిసీకా భాయ్ కిసీకా జాన్ లాంటి డిజాస్టర్ కళాఖండాలు ఇస్తూ నన్ను చూడటం లేదని వాపోతే ఎవరికి నష్టం. ఏదో స్టేట్ మెంట్ అనేస్తే పడి ఉంటుందిలే అనుకుంటే ఇలాంటి వంద కౌంటర్లు ప్రశ్నల రూపంలో రివర్స్ లో వచ్చి ప్రశ్నిస్తాయి భాయ్ సాబ్.
This post was last modified on March 29, 2025 8:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…