బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే డైరెక్టర్ గా సక్సెస్ లేక నటుడిగా మారిపోయారు కానీ సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ సత్తా చూపించే టాలెంట్ ఉన్నోడే. కొన్ని నెలల క్రితం సౌత్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని, తమ హిందీ రైటర్స్ మాత్రం బాంద్రాలో చక్కర్లు కొడుతూ మాస్ ని మర్చిపోయారని కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిలిం అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్ క్లాస్ కు అధ్యాపకుడిగా వచ్చిన అనురాగ్ కశ్యప్ చెప్పిన కొన్ని కీలక అంశాలు ప్రతి ఫిలిం మేకర్ ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ప్రతి ఒక్కరు తమకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు విస్తృతంగా సినిమాలు చూడాలి. రాజమౌళిని అనుకరించబోయి ఇప్పుడు పది మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. కానీ అందరూ సక్సెస్ కావడం లేదు. ఆయన ఐడియాలను కాపీ కొడితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉండాలి. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని అవే తీసిన దర్శకులు చాలానే ఉన్నారు. కానీ ఏమవుతోంది. ప్యాన్ ఇండియా కొత్త కాదు. చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున శివ ఎప్పుడో తొంభై దశకంలో వచ్చిన ప్యాన్ ఇండియాలు. కాకపోతే ఇప్పుడీ ట్రెండ్ బంగారు బాతులా మారిపోయింది.
అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను ఇమిటేట్ చేయబోయి దెబ్బ తింటున్న డైరెక్టర్లు చాలానే ఉన్నారు. ఆ మధ్య కన్నడలో వందల కోట్లు ఖర్చు పెట్టి కబ్జా తీస్తే అచ్చం కెజిఎఫ్ కు నకలుగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు విరుచుకు పడ్డారు. బాహుబలి చూసి విజయ్ చేసిన పులి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మణిరత్నం అంతటి దిగ్గజమే జక్కన్నను చూసే పొన్నియిన్ సెల్వన్ కి ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 మీద వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నా చాలా చిన్నదే అనిపిస్తుంది.
This post was last modified on March 28, 2025 10:16 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…