బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే డైరెక్టర్ గా సక్సెస్ లేక నటుడిగా మారిపోయారు కానీ సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ సత్తా చూపించే టాలెంట్ ఉన్నోడే. కొన్ని నెలల క్రితం సౌత్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని, తమ హిందీ రైటర్స్ మాత్రం బాంద్రాలో చక్కర్లు కొడుతూ మాస్ ని మర్చిపోయారని కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిలిం అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్ క్లాస్ కు అధ్యాపకుడిగా వచ్చిన అనురాగ్ కశ్యప్ చెప్పిన కొన్ని కీలక అంశాలు ప్రతి ఫిలిం మేకర్ ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ప్రతి ఒక్కరు తమకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు విస్తృతంగా సినిమాలు చూడాలి. రాజమౌళిని అనుకరించబోయి ఇప్పుడు పది మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. కానీ అందరూ సక్సెస్ కావడం లేదు. ఆయన ఐడియాలను కాపీ కొడితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉండాలి. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని అవే తీసిన దర్శకులు చాలానే ఉన్నారు. కానీ ఏమవుతోంది. ప్యాన్ ఇండియా కొత్త కాదు. చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున శివ ఎప్పుడో తొంభై దశకంలో వచ్చిన ప్యాన్ ఇండియాలు. కాకపోతే ఇప్పుడీ ట్రెండ్ బంగారు బాతులా మారిపోయింది.
అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను ఇమిటేట్ చేయబోయి దెబ్బ తింటున్న డైరెక్టర్లు చాలానే ఉన్నారు. ఆ మధ్య కన్నడలో వందల కోట్లు ఖర్చు పెట్టి కబ్జా తీస్తే అచ్చం కెజిఎఫ్ కు నకలుగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు విరుచుకు పడ్డారు. బాహుబలి చూసి విజయ్ చేసిన పులి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మణిరత్నం అంతటి దిగ్గజమే జక్కన్నను చూసే పొన్నియిన్ సెల్వన్ కి ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 మీద వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నా చాలా చిన్నదే అనిపిస్తుంది.
This post was last modified on March 28, 2025 10:16 am
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…