బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే డైరెక్టర్ గా సక్సెస్ లేక నటుడిగా మారిపోయారు కానీ సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ సత్తా చూపించే టాలెంట్ ఉన్నోడే. కొన్ని నెలల క్రితం సౌత్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని, తమ హిందీ రైటర్స్ మాత్రం బాంద్రాలో చక్కర్లు కొడుతూ మాస్ ని మర్చిపోయారని కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిలిం అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్ క్లాస్ కు అధ్యాపకుడిగా వచ్చిన అనురాగ్ కశ్యప్ చెప్పిన కొన్ని కీలక అంశాలు ప్రతి ఫిలిం మేకర్ ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ప్రతి ఒక్కరు తమకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు విస్తృతంగా సినిమాలు చూడాలి. రాజమౌళిని అనుకరించబోయి ఇప్పుడు పది మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. కానీ అందరూ సక్సెస్ కావడం లేదు. ఆయన ఐడియాలను కాపీ కొడితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉండాలి. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని అవే తీసిన దర్శకులు చాలానే ఉన్నారు. కానీ ఏమవుతోంది. ప్యాన్ ఇండియా కొత్త కాదు. చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున శివ ఎప్పుడో తొంభై దశకంలో వచ్చిన ప్యాన్ ఇండియాలు. కాకపోతే ఇప్పుడీ ట్రెండ్ బంగారు బాతులా మారిపోయింది.
అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను ఇమిటేట్ చేయబోయి దెబ్బ తింటున్న డైరెక్టర్లు చాలానే ఉన్నారు. ఆ మధ్య కన్నడలో వందల కోట్లు ఖర్చు పెట్టి కబ్జా తీస్తే అచ్చం కెజిఎఫ్ కు నకలుగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు విరుచుకు పడ్డారు. బాహుబలి చూసి విజయ్ చేసిన పులి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మణిరత్నం అంతటి దిగ్గజమే జక్కన్నను చూసే పొన్నియిన్ సెల్వన్ కి ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 మీద వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నా చాలా చిన్నదే అనిపిస్తుంది.
This post was last modified on March 28, 2025 10:16 am
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…