బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే డైరెక్టర్ గా సక్సెస్ లేక నటుడిగా మారిపోయారు కానీ సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ సత్తా చూపించే టాలెంట్ ఉన్నోడే. కొన్ని నెలల క్రితం సౌత్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని, తమ హిందీ రైటర్స్ మాత్రం బాంద్రాలో చక్కర్లు కొడుతూ మాస్ ని మర్చిపోయారని కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిలిం అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్ క్లాస్ కు అధ్యాపకుడిగా వచ్చిన అనురాగ్ కశ్యప్ చెప్పిన కొన్ని కీలక అంశాలు ప్రతి ఫిలిం మేకర్ ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ప్రతి ఒక్కరు తమకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు విస్తృతంగా సినిమాలు చూడాలి. రాజమౌళిని అనుకరించబోయి ఇప్పుడు పది మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. కానీ అందరూ సక్సెస్ కావడం లేదు. ఆయన ఐడియాలను కాపీ కొడితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉండాలి. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని అవే తీసిన దర్శకులు చాలానే ఉన్నారు. కానీ ఏమవుతోంది. ప్యాన్ ఇండియా కొత్త కాదు. చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున శివ ఎప్పుడో తొంభై దశకంలో వచ్చిన ప్యాన్ ఇండియాలు. కాకపోతే ఇప్పుడీ ట్రెండ్ బంగారు బాతులా మారిపోయింది.
అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను ఇమిటేట్ చేయబోయి దెబ్బ తింటున్న డైరెక్టర్లు చాలానే ఉన్నారు. ఆ మధ్య కన్నడలో వందల కోట్లు ఖర్చు పెట్టి కబ్జా తీస్తే అచ్చం కెజిఎఫ్ కు నకలుగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు విరుచుకు పడ్డారు. బాహుబలి చూసి విజయ్ చేసిన పులి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మణిరత్నం అంతటి దిగ్గజమే జక్కన్నను చూసే పొన్నియిన్ సెల్వన్ కి ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 మీద వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నా చాలా చిన్నదే అనిపిస్తుంది.
This post was last modified on March 28, 2025 10:16 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…