మే 30 కింగ్ డమ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత మరో రెండు ప్యాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణీవారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందేది. దీనికి రౌడీ జనార్దన్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇటీవలే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ లో చెప్పేసిన దిల్ రాజు త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీమ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాని దర్శకుడు రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఊహించని మాస్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని సమాచారం.
ఇదిలా ఉండగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఓకే చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారయ్యిందని అంటున్నారు. బేబీ జాన్ డిజాస్టర్ తర్వాత మహానటి నటించిన రివాల్వర్ రీటా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. టీజర్ వచ్చి నెలలు దాటింది. నితిన్ ఎల్లమ్మకు కూడా తననే అడుగుతున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియలేదు. దీనికీ నిర్మాత దిల్ రాజే కాబట్టి డబుల్ ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నారేమో చూడాలి. ఇప్పటి దాకా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జోడి కట్టలేదు. సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో నటించాక కీర్తి సురేష్ కు మళ్ళీ స్టార్ ఛాన్స్ రాలేదు.
మే నుంచి షూటింగ్ కు వెళ్ళబోతున్న రౌడీ జనార్దన్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ప్రథమార్ధంలో రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ఆలోచన. ఒకవేళ అన్నీ కుదిరితే సంక్రాంతి రేసులో కూడా దింపొచ్చు. ప్రస్తుతానికి అయన ప్రొడక్షన్ నుంచి ఏ సినిమా పండగ బరిలో లేదు. పెద్ద బడ్జెట్ తో ఎక్కువ శాతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే రౌడీ జనార్దన్ లో ఫారిన్ లొకేషన్స్ ఉండవని తెలిసింది. నిజానికి రుక్మిణి వసంత్ ను కూడా అనుకున్నారట కానీ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోకి ఏడాది సైన్ చేయడంతో వేరే వాటికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు వల్ల తనకు చాలా ఆఫర్సే మిస్సవుతున్నాయట.
This post was last modified on March 27, 2025 8:00 pm
టీడీపీ నాయకుడు, ఎస్సీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ.. అల్టిమేటం జారీ…
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న స్పోర్ట్స్ స్టార్లతో తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలను చేయించడం మంచి ఆలోచనే. కానీ కథకు ఎంత వరకు…
తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డును ఎవరూ చెరపలేరని.. ఎవరూ తిరగరాయలేరని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గన్నవరం స్థానిక కోర్టు.. ఒక్కరోజు కస్టడీకి…
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే.…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే. రాష్ట్ర విభజన తర్వాత…