కేవలం 12 రోజుల గ్యాప్ తో ఇద్దరు సౌత్ దర్శకుల బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మొదటిది సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈద్ సెంటిమెంట్ కోసం టీమ్ ని పరుగులు పెట్టించిన కండల వీరుడు హైప్ విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ జవాన్, పఠాన్ తరహాలో మాస్ హిస్టీరియా కనిపించడం లేదని బయ్యర్లు ఆందోళన చెబుతున్నారు. అందులోనూ ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయాయి.
సో మార్చి 30న థియేటర్లలో భాయ్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తేనే గట్టెక్కుతాడు. ఎంత మాస్ అయినా ఏమైనా తేడా కొడితే సల్మాన్ అని చూడకుండా ఆడియన్స్ తిరస్కరిస్తారు. గతంలో రాధే, రేస్ 3, ట్యూబ్ లైట్ లాంటి వాటితో అది ఋజువయ్యింది. మురుగదాస్ డైరెక్షన్ ఓల్డ్ స్కూల్ లో ఉందనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వినిపించింది. ఇక రెండోది ఏప్రిల్ 10 రిలీజ్ కాబోతున్న జాట్. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. టీజర్ చిన్నదే అయినా ట్రేడ్, మాస్ ని ఆకట్టుకుంది. బిజినెస్ ఎంక్వయిరీలు పెరిగాయని నార్త్ వర్గాల కథనం.
అసలైన జాట్ ట్రైలర్ ఇంకా రాలేదు. టీజర్ కొచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి మరింత శ్రద్ధ వహించబోతున్నారు. కథ పరంగా కొంచెం రొటీన్ గానే అనిపిస్తున్నా యాక్షన్ విజువల్స్, సన్నీని ప్రెజెంట్ చేసిన తీరు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలు పెంచుతున్నాయి. రమ్యకృష్ణ, జగపతి బాబు, రెజీనా లాంటి తెలుగు క్యాస్టింగ్ తీసుకోవడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. గదర్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత సన్నీ డియోల్ సినిమా కావడం హైప్ పరంగా అది కూడా ప్లస్ అవుతోంది. ఏ కోణంలో చూసుకున్నా మురుగదాస్ మీద మలిలేని పై చేయి సాధించాడు. మొదటి తీర్పు ఇంకో నాలుగు రోజుల్లో వస్తుందిగా. చూద్దాం సల్లు భాయ్ ఏం చేస్తాడో.
This post was last modified on March 26, 2025 2:50 pm
ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్…
రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…
ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…