టీజర్ తోనే అంచనాలు పెంచేసిన మ్యాడ్ స్క్వేర్ తాజాగా మరో రెండు నిమిషాల ట్రైలర్ తో హైప్ ఇంకాస్త పెంచేసింది. స్టోరీని కొంచెం కూడా దాచకుండా అరటిపండు ఒలిచినట్టు చెప్పేసి మరీ ఆడియన్స్ ని రమ్మంటున్నారు. లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇండియన్ కాపీలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, అవి సిద్ధం కాగానే ఎక్కడెక్కడ రేపు రాత్రి ప్రీమియర్లు వేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చూస్తే నమ్మకం ఓ రేంజ్ లో ఉన్నట్టే. మ్యాడ్ కూడా ఇదే తరహాలో స్పెషల్ ప్రీమియర్లకు నోచుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే రాబిన్ హుడ్ మీద మ్యాడ్ స్క్వేర్ ఆధిపత్యం కనిపిస్తోంది. థియేటర్ల కేటాయింపులో మైత్రి పడుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఇంకా స్క్రీన్ కౌంట్ తేలలేదు కానీ ఉన్నంతలో కొంత నెమ్మదిగా ఉన్న మాట వాస్తవం. యూత్ లో మటుకు మ్యాడ్ 2 మీద ఎక్కువ బజ్ ఉంది. మొదటి రోజే ఫన్ ఎంజాయ్ చేయాలని డిసైడవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కోసం నితిన్ నార్నె, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతకు ముందు కాలేజీలు తిరిగి పబ్లిసిటీ చేసుకున్నారు.
ఫైనల్ గా ఓపెనింగ్స్ కి కావాల్సిన లెక్క సరిపోయినట్టే. ఇక టికెట్ రేట్ల పెంపు గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. ధరలు తక్కువగా ఉండే కొన్ని సెంటర్లలో మాత్రమే హైక్ పెడుతున్నామని, మిగిలిన చోట సాధారణ రేట్లకే అందరూ మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేయొచ్చని నాగవంశీ చెప్పేశారు. ఎల్2 ఎంపురాన్ లాంటి గ్రాండియర్ పోటీలో ఉన్నప్పటికీ దాని వల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పడానికి లేదు. హైదరాబాద్ మినహాయించి ఎల్2 అమ్మకాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. బాగా బాగుందనే టాక్ వస్తే సామాన్య ప్రేక్షకులు వచ్చేందుకు ఛాన్స్ ఉంది. సో మ్యాడ్ స్క్వేర్ నిజంగా మేజిక్ చేస్తుందో లేదో రేపు రాత్రి తేలనుంది.
This post was last modified on March 26, 2025 2:32 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…