బాలకృష్ణ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఆదిత్య 369 వచ్చే నెల ఏప్రిల్ నాలుగు రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పదకొండు అనుకున్నారు కానీ దానికి ముందు రోజే పెద్ద సినిమాలు ఉండటంతో ప్రీ పోన్ చేశారు. 1991లో రిలీజైన ఈ క్లాసిక్ ని టీవీ, యూట్యూబ్ లో బోలెడుసార్లు ప్రేక్షకులు చూసినప్పటికీ కొత్త జనరేషన్ పెద్ద తెరపై అనుభూతి చెందాల్సిన కంటెంట్ ఇందులో బోలెడుంది. అయితే ఒక పాత సినిమాను 4కెలో కన్వర్ట్ చేసి సిద్ధం చేసి అంత తేలికైన విషయం కాదు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు చెప్పింది వింటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆదిత్య 369 ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు అభిమానుల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని శివలెంక కృష్ణప్రసాద్ ఆరేడు సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నెగటివ్ అందుబాటులో లేదు. దీంతో పాజిటివ్ రీల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ చాలా చోట్ల అవి డ్యామేజయ్యాయనే వార్తలొచ్చాయి. ఇలా వెతుకులాట కొనసాగుతుండగా విజయవాడ శాంతి పిక్చర్స్ అధినేత వెంకటేశ్వరరావు నుంచి తన దగ్గర మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేశారు. దాన్ని తీసుకుని నేరుగా చెన్నైలో ఉన్న ప్రసాద్ కార్పొరేషన్ కి ఇచ్చి పనులు మొదలుపెట్టారు. 4K కన్వర్షన్ అయిదారు నెలలు పట్టింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కృష్ణప్రసాద్ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయడం, ఇద్దరు కలిసి చూసుకుని సంతృప్తి చెందాక రీ రిలీజ్ ప్రకటన ఇవ్వడం జరిగిపోయింది. అనుకుంటాం కానీ పాత సినిమా నెగటివ్ లు సకాలంలో భద్రపర్చుకోకపోతే ఏమవుతుందో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. శివ విషయంలో ఈ ఇబ్బంది ఎదురైందని నాగార్జున ఆ మధ్య ఓ ఈవెంట్ లో చెప్పారు. గీతాంజలికి ఇంకా సమస్య తీరలేదని అన్నారు. ఏదైతేనేం ఆదిత్య 369 ఇవన్నీ దాటుకుని 5.1 సౌండ్ మిక్స్ తో ఏప్రిల్ 4 మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ ఆలోచన జరుగుతోంది.
This post was last modified on March 26, 2025 11:18 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…