బాలకృష్ణ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఆదిత్య 369 వచ్చే నెల ఏప్రిల్ నాలుగు రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పదకొండు అనుకున్నారు కానీ దానికి ముందు రోజే పెద్ద సినిమాలు ఉండటంతో ప్రీ పోన్ చేశారు. 1991లో రిలీజైన ఈ క్లాసిక్ ని టీవీ, యూట్యూబ్ లో బోలెడుసార్లు ప్రేక్షకులు చూసినప్పటికీ కొత్త జనరేషన్ పెద్ద తెరపై అనుభూతి చెందాల్సిన కంటెంట్ ఇందులో బోలెడుంది. అయితే ఒక పాత సినిమాను 4కెలో కన్వర్ట్ చేసి సిద్ధం చేసి అంత తేలికైన విషయం కాదు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు చెప్పింది వింటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆదిత్య 369 ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు అభిమానుల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని శివలెంక కృష్ణప్రసాద్ ఆరేడు సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నెగటివ్ అందుబాటులో లేదు. దీంతో పాజిటివ్ రీల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ చాలా చోట్ల అవి డ్యామేజయ్యాయనే వార్తలొచ్చాయి. ఇలా వెతుకులాట కొనసాగుతుండగా విజయవాడ శాంతి పిక్చర్స్ అధినేత వెంకటేశ్వరరావు నుంచి తన దగ్గర మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేశారు. దాన్ని తీసుకుని నేరుగా చెన్నైలో ఉన్న ప్రసాద్ కార్పొరేషన్ కి ఇచ్చి పనులు మొదలుపెట్టారు. 4K కన్వర్షన్ అయిదారు నెలలు పట్టింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కృష్ణప్రసాద్ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయడం, ఇద్దరు కలిసి చూసుకుని సంతృప్తి చెందాక రీ రిలీజ్ ప్రకటన ఇవ్వడం జరిగిపోయింది. అనుకుంటాం కానీ పాత సినిమా నెగటివ్ లు సకాలంలో భద్రపర్చుకోకపోతే ఏమవుతుందో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. శివ విషయంలో ఈ ఇబ్బంది ఎదురైందని నాగార్జున ఆ మధ్య ఓ ఈవెంట్ లో చెప్పారు. గీతాంజలికి ఇంకా సమస్య తీరలేదని అన్నారు. ఏదైతేనేం ఆదిత్య 369 ఇవన్నీ దాటుకుని 5.1 సౌండ్ మిక్స్ తో ఏప్రిల్ 4 మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ ఆలోచన జరుగుతోంది.
This post was last modified on March 26, 2025 11:18 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…