తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజు ఓ విషాదం విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించిన షిహాన్ హుస్సేని మరణించారు. ఈ పేరు మనవాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. ఆ వ్యక్తితో టాలీవుడ్కు కూడా ఓ బలమైన కనెక్షన్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి రావడానికి ముందే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చిన వ్యక్తి షిహానే. అంతే కాదు.. కళ్యాణ్ గా ఉన్న పవన్ పేరును ‘పవన్ కళ్యాణ్’గా మార్చింది కూడా ఆయనే కావడం విశేషం. 60 ఏళ్ల షిహాన్ హుస్సేన్ సోమవారం గుండెపోటుతో మరణించారు.
ఆయన కొన్నేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాటం చేస్తున్నారు. గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం చికిత్స కోసం షిహాన్కు రూ.5 లక్షల సాయం కూడా చేసింది. క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న దశలో ఆయనకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు.కరాటెలోనే కాక ఆర్చరీలోనూ నిపుణుడైన షిహాన్.. 80వ దశకంలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టారు. రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. ఎక్కువగా ఫైటర్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి పాత్రల్లోనే కనిపించారు. చివరగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటించిన ‘కేఆర్కే’ సినిమాలో ఆయన కనిపించారు.
‘తమ్ముడు’ సినిమాలో పవన్ తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పాలని గురువు దగ్గర పంతం పట్టి నేర్చుకుంటాడన్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో షిహాన్ దగ్గర కూడా ఇలాగే పట్టుబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. కళ్యాణ్ అన్న పేరు ముందు ‘పవన్’ చేర్చింది తానే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో షిహాన్ తెలిపాడు. ఇదిలా ఉండగా తన మరణానంతరం అవయవాలను దానం చేయాలని షిహాన్ ముందే తీర్మానం చేయడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
షిహాన్ మరణంపై పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. షిహాన్ అనారోగ్యం గురించి తనకు నాలుగు రోజుల కిందటే తెలిసిందని.. చెన్నైలోని తన మిత్రుల ద్వారా వాకబు చేసి ఆయన్ని విదేశాలకు పంపడానికి ఏర్పాట్లు కూడా చేస్తానని హామీ ఇచ్చానని పవన్ తెలిపారు. ఈ నెల 29న షిహాన్ను కలవాలనుకున్నానని.. ఈలోపే దుర్వార్త వినాల్సి వచ్చిందని పవన్ చెప్పారు. ‘తమ్ముడు’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ సంబంధిత సన్నివేశాలను అంత బాగా చేయడానికి షిహాన్ ఇచ్చిన శిక్షణే దోహదం చేసిందని పవన్ తెలిపారు. తనకు శిక్షణ ఇవ్వడానికి ముందు ఆయన ఒప్పుకోలేదని.. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేసుకున్నారు.
This post was last modified on March 25, 2025 1:49 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…