కరోనా టైంలో మిగతా సినీ ప్రముఖులంతా షూటింగ్ల కోసం హడావుడి పడుతుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని కలిసి షూటింగ్లకు అనుమతులు కోరుతుంటే.. అదంతా వృథా ప్రయాస అని తేల్చేసి, ఇప్పుడిప్పుడే షూటింగ్లు మొదలు కాబోవని తేల్చేశాడు నందమూరి బాలకృష్ణ. ముందు ఆయన మాటల్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి.
కరోనా తీవ్రత దృష్ట్యా అనుకున్న ప్రకారం షూటింగ్లు మొదలుపెట్లేకపోయారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కొందరు పని మొదలుపెట్టినా కరోనా ధాటికి మధ్యలో ఆపేశారు. ఎట్టకేలకు గత నెల రోజుల నుంచే షూటింగ్లు పున:ప్రారంభించి చకచకా పని చేసుకుపోతున్నారు. ఈ టైంలో కూడా బాలయ్య కొంచెం వెయిట్ చేశారు. చివరికి ఆయన కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.
టాలీవుడ్ విషయానికి వస్తే ఇక రంగంలోకి దిగాల్సిన పెద్ద హీరోల్లో చిరంజీవి ఒకరు. కరోనా విజృంభిస్తున్న టైంలోనే షూటింగ్ కోసం చాలా ఆతృతగా కనిపించిన చిరు.. ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకట్రెండు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా పున:ప్రారంభం అవుతుందని.. ముందు చిరు లేని సన్నివేశాలు తీస్తారని, నవంబరు 3న ఆయన సెట్స్ పైకి వస్తారని అంటున్నారు.
This post was last modified on October 29, 2020 3:13 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…