కరోనా టైంలో మిగతా సినీ ప్రముఖులంతా షూటింగ్ల కోసం హడావుడి పడుతుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని కలిసి షూటింగ్లకు అనుమతులు కోరుతుంటే.. అదంతా వృథా ప్రయాస అని తేల్చేసి, ఇప్పుడిప్పుడే షూటింగ్లు మొదలు కాబోవని తేల్చేశాడు నందమూరి బాలకృష్ణ. ముందు ఆయన మాటల్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి.
కరోనా తీవ్రత దృష్ట్యా అనుకున్న ప్రకారం షూటింగ్లు మొదలుపెట్లేకపోయారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కొందరు పని మొదలుపెట్టినా కరోనా ధాటికి మధ్యలో ఆపేశారు. ఎట్టకేలకు గత నెల రోజుల నుంచే షూటింగ్లు పున:ప్రారంభించి చకచకా పని చేసుకుపోతున్నారు. ఈ టైంలో కూడా బాలయ్య కొంచెం వెయిట్ చేశారు. చివరికి ఆయన కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.
టాలీవుడ్ విషయానికి వస్తే ఇక రంగంలోకి దిగాల్సిన పెద్ద హీరోల్లో చిరంజీవి ఒకరు. కరోనా విజృంభిస్తున్న టైంలోనే షూటింగ్ కోసం చాలా ఆతృతగా కనిపించిన చిరు.. ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకట్రెండు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా పున:ప్రారంభం అవుతుందని.. ముందు చిరు లేని సన్నివేశాలు తీస్తారని, నవంబరు 3న ఆయన సెట్స్ పైకి వస్తారని అంటున్నారు.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…