కరోనా టైంలో మిగతా సినీ ప్రముఖులంతా షూటింగ్ల కోసం హడావుడి పడుతుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని కలిసి షూటింగ్లకు అనుమతులు కోరుతుంటే.. అదంతా వృథా ప్రయాస అని తేల్చేసి, ఇప్పుడిప్పుడే షూటింగ్లు మొదలు కాబోవని తేల్చేశాడు నందమూరి బాలకృష్ణ. ముందు ఆయన మాటల్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి.
కరోనా తీవ్రత దృష్ట్యా అనుకున్న ప్రకారం షూటింగ్లు మొదలుపెట్లేకపోయారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కొందరు పని మొదలుపెట్టినా కరోనా ధాటికి మధ్యలో ఆపేశారు. ఎట్టకేలకు గత నెల రోజుల నుంచే షూటింగ్లు పున:ప్రారంభించి చకచకా పని చేసుకుపోతున్నారు. ఈ టైంలో కూడా బాలయ్య కొంచెం వెయిట్ చేశారు. చివరికి ఆయన కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.
టాలీవుడ్ విషయానికి వస్తే ఇక రంగంలోకి దిగాల్సిన పెద్ద హీరోల్లో చిరంజీవి ఒకరు. కరోనా విజృంభిస్తున్న టైంలోనే షూటింగ్ కోసం చాలా ఆతృతగా కనిపించిన చిరు.. ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకట్రెండు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా పున:ప్రారంభం అవుతుందని.. ముందు చిరు లేని సన్నివేశాలు తీస్తారని, నవంబరు 3న ఆయన సెట్స్ పైకి వస్తారని అంటున్నారు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…