కరోనా టైంలో మిగతా సినీ ప్రముఖులంతా షూటింగ్ల కోసం హడావుడి పడుతుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని కలిసి షూటింగ్లకు అనుమతులు కోరుతుంటే.. అదంతా వృథా ప్రయాస అని తేల్చేసి, ఇప్పుడిప్పుడే షూటింగ్లు మొదలు కాబోవని తేల్చేశాడు నందమూరి బాలకృష్ణ. ముందు ఆయన మాటల్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి.
కరోనా తీవ్రత దృష్ట్యా అనుకున్న ప్రకారం షూటింగ్లు మొదలుపెట్లేకపోయారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కొందరు పని మొదలుపెట్టినా కరోనా ధాటికి మధ్యలో ఆపేశారు. ఎట్టకేలకు గత నెల రోజుల నుంచే షూటింగ్లు పున:ప్రారంభించి చకచకా పని చేసుకుపోతున్నారు. ఈ టైంలో కూడా బాలయ్య కొంచెం వెయిట్ చేశారు. చివరికి ఆయన కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.
టాలీవుడ్ విషయానికి వస్తే ఇక రంగంలోకి దిగాల్సిన పెద్ద హీరోల్లో చిరంజీవి ఒకరు. కరోనా విజృంభిస్తున్న టైంలోనే షూటింగ్ కోసం చాలా ఆతృతగా కనిపించిన చిరు.. ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకట్రెండు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా పున:ప్రారంభం అవుతుందని.. ముందు చిరు లేని సన్నివేశాలు తీస్తారని, నవంబరు 3న ఆయన సెట్స్ పైకి వస్తారని అంటున్నారు.
This post was last modified on October 29, 2020 3:13 pm
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…