పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన మిత్రుడైన రామ్ తాళ్ళూరి గతంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. దీనికో ప్రి లుక్ పోస్టర్ కూడా డిజైన్ చేసింది చిత్ర బృందం. కానీ ఈ సినిమాను ప్రకటించి ఏళ్లు గడిచినా ఏ అప్డేట్ లేదు. పవన్ చేతిలో ఆల్రెడీ మూడు చిత్రాలున్నాయి. అవే పూర్తి కాలేదు. ఈ మూడూ ఫినిష్ అయ్యి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియట్లేదు. పవన్ చూస్తే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ నిర్మాణంలో సురేందర్ తీయాల్సిన ఈ చిత్రాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.
ఈ మేరకు మీడియాకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చింది. ఐతే పవన్ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదేదో కొత్త విషయంలా మాట్లాడుతున్నారు. కానీ ఈ చిత్రంపై నిర్మాత రామ్ తాళ్ళూరి ఎప్పుడో ఆశలు కోల్పోయారు. తన ప్రొడక్షన్లో వచ్చిన చివరి చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ టైంలోనే ఆయనీ విషయమై క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమా మీద తాము ఆశలు కోల్పోయామన్నారు.
పవన్ ప్రస్తుతం ఉన్న బిజీలో ఈ సినిమా చేస్తామనే వాస్తవిక అంచనా లేదని చెప్పేశారు. మరోవైపు సురేందర్ రెడ్డి చూస్తే ఈ సినిమా ఊసే ఎత్తకుండా వేరే ప్రయత్నాలేవో చేసుకుంటున్నాడు. అధికారికంగా ప్రకటించలేదన్న మాటే కానీ.. ఈ మూవీ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయినట్లే. ఇప్పుడు లాంఛనం ముగిసింది అన్నమాట. అసలు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు కదులుతుందో లేదో అన్న సందేహాలు కలుగుతుండడం గమనార్హం.
This post was last modified on March 23, 2025 2:39 pm
ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు.…
ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ…
తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు.…