హీరోలన్నాక ఫ్లాపులు సహజం. కాకపోతే వరసగా వస్తేనే ఇబ్బంది. నితిన్ కు ఈ సమస్య ఎదురయ్యింది. ప్రతిసారి ఒక హిట్టు రావడం ఆలస్యం వెనుక క్యూలో రెండు మూడు డిజాస్టర్లు పలకరిస్తాయి. అందుకే రాబిన్ హుడ్ మీద ఓ రేంజ్ లో నమ్మకం పెట్టేసుకున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి భారీ అంచనాల మధ్య తలకిందుల ఫలితాలు అందుకున్నాయి. వీటి కన్నా ముందు రంగ్ దే, చెక్ కూడా పరాజయం మూటగట్టుకున్నాయి. అందుకే చివరి హిట్ భీష్మ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతోనే మరోసారి చేతులు కలిపాడు. మార్చి 28 రాబిన్ హుడ్ తో గురి తప్పదనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు.
ఈ సందర్భంగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లాపుల గురించి నితిన్ నిజాయితీగా ఓపెనయ్యాడు. నా స్క్రిప్ట్ ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్లనో లేదా పక్కనున్న వాళ్ళు ప్రభావితం చేయడం వల్లనో కారణం ఏదైతేనేం ఒక హిట్టు మూడు ఫ్లాపులుగా కెరీర్ హెచ్చుతగ్గులకు గురైందని ఒప్పుకున్నాడు. రాబోయే సంవత్సరాల్లో పాత్ బ్రేకింగ్ మూవీస్ తో మళ్ళీ ఋజువు చేసుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో రాబోయే తమ్ముడు ట్రైలర్ మీద ఇండస్ట్రీలో ప్రీ పాజిటివ్ బజ్ ఉంది. ఎల్లమ్మ తనకు నటుడిగానూ ఒక ఛాలెంజ్ గా నిలుస్తుందని జయంని మించిన రూటెడ్ కంటెంట్ ఉంటుందని నితిన్ చెబుతున్నాడు.
ఇక యువి క్రియేషన్స్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తీయబోయే భారీ చిత్రం తనకు చెప్పిన ప్రకారమే తీస్తే టాలీవుడ్ ఎప్పటికీ చెప్పుకునే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని నితిన్ నమ్మకం. మొత్తానికి తన లైనప్ రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా నిజంగానే వైవిధ్యంగా కనిపిస్తోంది. రాబిన్ హుడ్ తో కనక సక్సెస్ ట్రాక్ ఎక్కితే మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. హీరోయిన్ శ్రీలీల, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల మార్క్ ఎంటర్ టైన్మెంట్, మైత్రి నిర్మాణ విలువలు వెరసి ఎంత పోటీ ఉన్నా రాబిన్ హుడ్ హిట్టవుతుందనే ధీమా నితిన్ లో కనిపిస్తోంది. వచ్చే వారం తీర్పు వచ్చేస్తుంది.
This post was last modified on March 21, 2025 7:55 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…