యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఐతే సరైన విజయాలు లేకపోయినా నితిన్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ వచ్చిన రెండు నెలలకే వేణు శ్రీరామ్ సినిమా ‘తమ్ముడు’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాను చేయబోయే మిగతా చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నితిన్.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విక్రమ్ కుమార్ సినిమా చాలా స్పెషల్ అని అతను చెప్పాడు. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి వస్తే టాలీవుడ్ గర్వించే మూవీ అవుతుందని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘‘తమ్ముడు సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ట్రైలర్ రిలీజైతే అది ఏ రేంజ్ మూవీ అన్నది అర్థమవుతుంది. అది పూర్తి కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వేణు దర్శకత్వంలో చేయబోతున్న ‘యల్లమ్మ’ సినిమాను మొదలుపెడతాం. దాని గురించి కూడా ఇప్పుడేమీ చెప్పను. అది చాలా ప్రత్యేకమైన చిత్రం.
దీంతో పాటుగా విక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ దానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రమిది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. విజువల్గా ఇంతకుముందు ఎన్నడూ చూడనిది ఈ సినిమాలో చూస్తాం. విక్రమ్ నాకు ఏం చెప్పాడో అది స్క్రీన్ మీదికి తీసుకురాగలిగితే తెలుగు వాళ్లు గర్వించే సినిమా అవుతుంది. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అది పూర్తి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది’’ అని నితిన్ వెల్లడించాడు.
This post was last modified on March 21, 2025 5:21 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…