యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఐతే సరైన విజయాలు లేకపోయినా నితిన్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ వచ్చిన రెండు నెలలకే వేణు శ్రీరామ్ సినిమా ‘తమ్ముడు’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాను చేయబోయే మిగతా చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నితిన్.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విక్రమ్ కుమార్ సినిమా చాలా స్పెషల్ అని అతను చెప్పాడు. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి వస్తే టాలీవుడ్ గర్వించే మూవీ అవుతుందని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘‘తమ్ముడు సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ట్రైలర్ రిలీజైతే అది ఏ రేంజ్ మూవీ అన్నది అర్థమవుతుంది. అది పూర్తి కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వేణు దర్శకత్వంలో చేయబోతున్న ‘యల్లమ్మ’ సినిమాను మొదలుపెడతాం. దాని గురించి కూడా ఇప్పుడేమీ చెప్పను. అది చాలా ప్రత్యేకమైన చిత్రం.
దీంతో పాటుగా విక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ దానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రమిది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. విజువల్గా ఇంతకుముందు ఎన్నడూ చూడనిది ఈ సినిమాలో చూస్తాం. విక్రమ్ నాకు ఏం చెప్పాడో అది స్క్రీన్ మీదికి తీసుకురాగలిగితే తెలుగు వాళ్లు గర్వించే సినిమా అవుతుంది. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అది పూర్తి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది’’ అని నితిన్ వెల్లడించాడు.
This post was last modified on March 21, 2025 5:21 pm
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…