యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఐతే సరైన విజయాలు లేకపోయినా నితిన్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ వచ్చిన రెండు నెలలకే వేణు శ్రీరామ్ సినిమా ‘తమ్ముడు’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాను చేయబోయే మిగతా చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నితిన్.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విక్రమ్ కుమార్ సినిమా చాలా స్పెషల్ అని అతను చెప్పాడు. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి వస్తే టాలీవుడ్ గర్వించే మూవీ అవుతుందని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘‘తమ్ముడు సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ట్రైలర్ రిలీజైతే అది ఏ రేంజ్ మూవీ అన్నది అర్థమవుతుంది. అది పూర్తి కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వేణు దర్శకత్వంలో చేయబోతున్న ‘యల్లమ్మ’ సినిమాను మొదలుపెడతాం. దాని గురించి కూడా ఇప్పుడేమీ చెప్పను. అది చాలా ప్రత్యేకమైన చిత్రం.
దీంతో పాటుగా విక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ దానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రమిది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. విజువల్గా ఇంతకుముందు ఎన్నడూ చూడనిది ఈ సినిమాలో చూస్తాం. విక్రమ్ నాకు ఏం చెప్పాడో అది స్క్రీన్ మీదికి తీసుకురాగలిగితే తెలుగు వాళ్లు గర్వించే సినిమా అవుతుంది. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అది పూర్తి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది’’ అని నితిన్ వెల్లడించాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…