యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఐతే సరైన విజయాలు లేకపోయినా నితిన్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ వచ్చిన రెండు నెలలకే వేణు శ్రీరామ్ సినిమా ‘తమ్ముడు’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాను చేయబోయే మిగతా చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నితిన్.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విక్రమ్ కుమార్ సినిమా చాలా స్పెషల్ అని అతను చెప్పాడు. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి వస్తే టాలీవుడ్ గర్వించే మూవీ అవుతుందని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘‘తమ్ముడు సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ట్రైలర్ రిలీజైతే అది ఏ రేంజ్ మూవీ అన్నది అర్థమవుతుంది. అది పూర్తి కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వేణు దర్శకత్వంలో చేయబోతున్న ‘యల్లమ్మ’ సినిమాను మొదలుపెడతాం. దాని గురించి కూడా ఇప్పుడేమీ చెప్పను. అది చాలా ప్రత్యేకమైన చిత్రం.
దీంతో పాటుగా విక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ దానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రమిది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. విజువల్గా ఇంతకుముందు ఎన్నడూ చూడనిది ఈ సినిమాలో చూస్తాం. విక్రమ్ నాకు ఏం చెప్పాడో అది స్క్రీన్ మీదికి తీసుకురాగలిగితే తెలుగు వాళ్లు గర్వించే సినిమా అవుతుంది. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అది పూర్తి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది’’ అని నితిన్ వెల్లడించాడు.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…