మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్ హాల్లో సత్కారం అందుకోవడం అభిమానులను అమితానందానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా ఫ్యాన్స్ మీట్ పేరుతో ఓ సంస్థ దందా నిర్వహించిన విషయం తెలిసి చిరంజీవి అలెర్ట్ అయ్యారు. తన మీద అభిమానంతో తనను కలవడానికి వచ్చిన అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.‘‘ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ నా మనసును హత్తుకుంది. కానీ ఫ్యాన్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిని నేను సమర్థించను.
దీన్ని గట్టిగా ఖండిస్తున్నాను. ఫ్యాన్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం అపారమైనది, విలువైనది. మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దయచేసి స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిరుకు జరిగిన సత్కారం ఏంటి.. ఎవరు చేశారనే విషయంలో నిన్నట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.
యూకే పార్లమెంటే ఆయన్ని సత్కరించినట్లుగా పవన్ కళ్యాణ్ సహా చాలామంది పోస్టులు పెట్టారు కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. యూకే పార్లమెంట్ హాల్లో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒక ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి యూకే పార్లమెంటేరియన్లు కొందరు అతిథులుగా వచ్చారు. ఇది విశేషమే అయినప్పటికీ.. యూకే పార్లమెంటే చిరును సత్కరించినట్లుగా పేర్కొనడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.
This post was last modified on March 21, 2025 2:31 pm
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…