Movie News

యుకేలో ఫ్యాన్స్ మీట్ దందా… చిరు ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్ హాల్‌లో సత్కారం అందుకోవడం అభిమానులను అమితానందానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా ఫ్యాన్స్ మీట్ పేరుతో ఓ సంస్థ దందా నిర్వహించిన విషయం తెలిసి చిరంజీవి అలెర్ట్ అయ్యారు. తన మీద అభిమానంతో తనను కలవడానికి వచ్చిన అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.‘‘ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ నా మనసును హత్తుకుంది. కానీ ఫ్యాన్‌ మీట్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిని నేను సమర్థించను.

దీన్ని గట్టిగా ఖండిస్తున్నాను. ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం అపారమైనది, విలువైనది. మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దయచేసి స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిరుకు జరిగిన సత్కారం ఏంటి.. ఎవరు చేశారనే విషయంలో నిన్నట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.

యూకే పార్లమెంటే ఆయన్ని సత్కరించినట్లుగా పవన్ కళ్యాణ్ సహా చాలామంది పోస్టులు పెట్టారు కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. యూకే పార్లమెంట్ హాల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒక ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి యూకే పార్లమెంటేరియన్లు కొందరు అతిథులుగా వచ్చారు. ఇది విశేషమే అయినప్పటికీ.. యూకే పార్లమెంటే చిరును సత్కరించినట్లుగా పేర్కొనడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.

This post was last modified on March 21, 2025 2:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chiranjeevi

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

10 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

47 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago